Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh ఏపీలో విద్యార్థులను మోసం చేస్తున్న జగన్

ఏపీలో విద్యార్థులను మోసం చేస్తున్న జగన్

by Satya
cm jagan

ఏపీలో చదువుకున్న విద్యార్థులను సీఎం జగన్ దారుణంగా మోసం చేశారని, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎన్నికల ముందు చెప్పారని, జాబ్ క్యాలెండర్ సంగతి ఏమో కాని ప్రతి ఏడాది సాక్షి క్యాలెండర్ మాత్రం విడుదల చేస్తున్నారన్నారు. తెలుగు యువత పల్నాడు జిల్లా అధ్యక్షుడు కుమ్మెత కోటిరెడ్డి. పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో కోటిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ , విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తే వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము అని దొంగ ప్రకటన విడుదల చేస్తారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని వాళ్లు ఈరోజు సీఎం జగన్ ని ఒక ద్రోహిగా చూస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిరుద్యోగ సమస్యలో దేశంలోనే నంబర్ వన్ గా మారిందన్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలనే చాలా తొలగించారన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు చూసైనా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేసారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: