Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Andhra Pradesh రామచంద్ర యాదవ్ హాట్ కామెంట్స్….

రామచంద్ర యాదవ్ హాట్ కామెంట్స్….

by Prakash
BCY Party President Ramachandra Yadav

ప్రశాంతంగా ఉన్న పుంగనూరులో రామచంద్రారెడ్డి అనే చీడ పురుగు ప్రవేశించిందని, ఆయన 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతు అందినకాడికి దోచుకున్నారని బిసివై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఎద్దేవా చేసారు. తను బినామీలను పెట్టుకొని భూములను, ఇసుకను, ఎర్రచందనాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని, వ్యవస్థలను అడ్డం పెట్టుకొని రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చిత్తూరు జిల్లా ఎస్పి రిషాంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని దౌర్జన్యానికి పాల్పడ్డారని, నా పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి వస్తుంటే అడ్డుకున్నారని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేసారు. పోలిసులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లు నడుచుకుంటున్నారని, నేను శాంతియుతంగా సభ నిర్వహించుకుంటే మీకెందుకు భయమని ఆయన రామచంద్రారెడ్డిని నిలదీశారు. మీరు చేసిన అరాచకాలు, దోపిడీలు బయటకు వస్తాయని భయపడుతున్నారా? అని ఆయన ప్రశ్నించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక పిరికిపందని పోలిసులు లేకుండా ఆయన బయటకు తిరగలేని పరిస్థితుల్లో ఉన్నారని ఎద్దేవా చేసారు. ప్రజలందరూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై తిరుగుబాటు ప్రారంభించారని, 2024 ఎన్నికల్లో పుంగునూరులో ఆయనని ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాన్నారు. పుంగనూరు లో జరిగిన ఘటనలపై నేను హై కోర్టును ఆశ్రయిస్తానని, పోలిసులపై ప్రైవేట్ కేసు వేస్తానని అన్నారు. రాబోయే మరో 3 నెలల్లో మంత్రి రామచంద్రారెడ్డిని పుంగనూరు నుండి తరిమి తరిమి కొడతానని. నా పై నా కార్యకర్తలు పై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేసేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోందని ఆయన అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

014791
Total views : 81041

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.