Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home TelanganaWarangal మద్యం మత్తులో దారుణానికి పాల్పడిన యువకులు..

మద్యం మత్తులో దారుణానికి పాల్పడిన యువకులు..

by Rama
warangal police

మద్యం మత్తులో ముగ్గురు యువకులు రాకేష్ అనే వ్యక్తి ని హత్య చేశారని వరంగల్ ఏసిపి బోనాల కిషన్ తెలిపారు. వరంగల్ నగరంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం ముందు ఈనెల 5వ తేదీన రాత్రి చెందిన రాకేష్ అనే వ్యక్తి మరో మహిళతో వంటలు చేసేందుకు తొర్రూరు వెళ్తున్న క్రమంలో వరంగల్ గరీబ్ నగర్ కు చెందిన ముగ్గురు యువకులు శ్రీధర్, బన్నీ, ఇస్లావత్ ప్రవీణ్ రాత్రి ఆటోలో అటుగా వెళ్లి రాకేష్ తో ఉన్న మహిళను లైంగికంగా వేధించారు. దీంతో రాకేష్ ప్రతిఘటించడంతో ముగ్గురు యువకులు అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిని గమనించిన స్థానికులు రాకేష్ ను చికిత్స నిమిత్తం ఎంజీఎం హాస్పిటల్ కి తరలించారు. రాకేష్ 13వ తేది రాత్రి మృతి చెందాడు. రాకేష్ హత్యకు కారణమైన ముగ్గురిని అరెస్ట్ చేశామని వారి నుండి హత్యకు ఉపయోగించిన రాళ్లు సేకరించామని వారిని కోర్టులో హాజరు పర్చనున్నట్లు వరంగల్ ఏసిపి బోనాల కిషన్ తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

014580
Total views : 80506

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.