Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh యువగళం విజయోత్సవ సభపై మాజీ మంత్రి విమర్శలు

యువగళం విజయోత్సవ సభపై మాజీ మంత్రి విమర్శలు

by Satya
Kodali Nani

పవన్, లోకేష్, చంద్రబాబు నిన్న చేసింది పిల్లి మెడలో గంట కట్టే ప్రయత్నమే అని యువగళం విజయోత్సవ సభపై మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. 12 ఏళ్ల క్రితం యుద్ధభేరి మోగించిన సీఎం జగన్, సోనియాను కూకటి వేళ్లతో పెకిలించి చంద్రబాబును భూస్థాపితం చేసి పవన్ కళ్యాణ్ ను రెండు చోట్ల చిత్తుచిత్తు చేస్తూ మంగళగిరిలో లోకేష్ కు సమాధి కట్టాడన్నారు. పవన్ ,లోకేష్, చంద్రబాబు ఇప్పుడు గంటల మోగిస్తూ యుద్ధభేరి మొదలు పెట్టిన జగన్ జైత్రయాత్ర పరంపరను ఆపలేరని, ఎమ్మెల్యేలకు ట్రాన్స్ ఫర్లు ఉంటాయా అంటూ చంద్రబాబు విచిత్రంగా మాట్లాడుతున్నాడన్నారు. 30 ఏళ్ల క్రితమే చంద్రబాబు చంద్రగిరి నుండి కుప్పం ట్రాన్స్ ఫర్ అయ్యాడన్నారు. లోకేష్ పుట్టింది మంగళగిరిలోనా అని, పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాకలో గోలీలు ఆడుకున్నాడా అని ప్రశ్నించారు. తండ్రి, కొడుకు ,పార్ట్నర్ ముగ్గురు వలస వెళ్లిన వాళ్లేనని, వీళ్లు మొదలుపెట్టిన యుద్ధభేరితో సీఎం జగన్ చిటికెన వేలిని కూడా కదపలేరన్నారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

039612
Total views : 198703

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: