Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra PradeshEast Godavari ఎమ్మెల్యే కబ్జాల పై జనసేన పోరాటం

ఎమ్మెల్యే కబ్జాల పై జనసేన పోరాటం

by Rama
Janasena leader

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గం అత్యంత ధనిక ప్రాంతంగా పేరు ఉంది. పారిశ్రామిక వాడలు, ఓడరేవులు, ఖరీదైన భూములు ఇక్కడే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం ఇక్కడే జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఆయన అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నారని జనసేన సీనియర్ నేత ఆరోపిస్తున్నారు. కాకినాడ రూరల్ నియోజవర్గంలో ఖరీదైన భూములతో పాటు లేఔట్లకు సంబంధించి సామాజిక స్థలాలు కూడా ఎమ్మెల్యే సోదరుడు, పిఏ, బంధువులు వారి పేరు మీద రాయించుకున్నారని భావనారాయణ స్వామి ఆలయ మాజీ చైర్మన్, జనసేన రూరల్ నియోజవర్గ ప్రతినిధి పుల్లా శ్రీరాములు (దేవస్థానం శ్రీను) ఆరోపిచారు. సమాచార హక్కు చట్టం కింద తాను తీసుకున్న వివరాలు ప్రకారమే ఈ ఆరోపణలు చేస్తున్నాను అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే రూరల్ పై ఆరోపణలు చేశారని తాను సేకరించిన కబ్జాల సమాచారాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్తున్నట్లు శ్రీరాములు తెలిపారు. అదేవిధంగా న్యాయపోరాటం కూడా చేస్తున్నట్లు తెలిపారు. దమ్ము, ధైర్యం ఉంటే ఎమ్మెల్యే, ఆయన అనుచరులు బహిరంగ చర్చికి సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: