Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh వరకట్న వేధింపులకు గురి చేస్తున్న కానిస్టేబుల్…

వరకట్న వేధింపులకు గురి చేస్తున్న కానిస్టేబుల్…

by Prakash
Vijaya Kumari who showed the marriage certificate

చిత్తూరు జిల్లా పుంగనూరు లో వరకట్నం వేధింపులు తాళ లేక భర్త పై భార్య ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఏఆర్ కానిస్టేబుల్ భార్య విజయ కుమారి (28) ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం తనకు న్యాయం చేయాలని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన చేపట్టింది. చౌడేపల్లి సర్కిల్లో గల సదుం పోలీస్ స్టేషన్లో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న టి. గిరిబాబు కు 2017 సంవత్సరంలో తనతో వివాహం జరిగిందని విజయ కుమారి తన దగ్గర ఉన్న మ్యారేజ్ సర్టిఫికెట్ ను చూపించింది. గిరిబాబు ఈ మధ్యనే అన్లైన్లో లక్షల రూపాయల డబ్బును పోగొట్టుకోన్నట్లు, దాని కారణంతోనే తనను పుట్టింట నుండి వరకట్నం తేవాలని వేధింపులకు గురి చేస్తున్నాడని విజయ కుమారి ఆరోపించింది. డబ్బుకోసం ఇంకో యువతిని వివాహం చేసుకోవటానికి సిద్దపడ్డాడని, రెండు రోజుల క్రితం సదుంలోని ఓ గుడిలో రెండో వివాహం చేసుకున్నాడని ఆవిడ ఆరోపించింది. ఈ ఘటన పై పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసారు.

Advertisements

You may also like

Our Visitor

014227
Total views : 79585

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.