Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh ఏపీఎస్ఈబి ఇంజనీర్స్ నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ…

ఏపీఎస్ఈబి ఇంజనీర్స్ నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ…

by Prakash
APSEB Engineers New Year Diary Launched

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీ ని విజయవాడలో సంఘం నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ చైర్మన్ శైలేంద్ర కుమార్ దుబే పాల్గొనగా ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రావు 2024 డైరీ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రావు మాట్లాడుతూ 2022వ సంవత్సరానికి సంబంధించిన వేతన సవరణ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పవర్ ఇంజనీర్స్ కు తీవ్ర అన్యాయం జరిగిందని, విద్యుత్ మేనేజ్మెంట్ లోపభూయిష్టమైన విధానాలతో ఇంజనీర్లకు వేతన సవరణలో అలసత్వం చోటుచేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ల డిమాండ్లపై విద్యుత్తు శాఖ మేనేజ్మెంట్ తో చర్చించి న్యాయమైన డిమాండ్ల సాధనకు కృషి చేయాలని ఆయన కోరారు. పిఆర్సి లో పవర్ ఇంజనీర్లకు జరిగిన అన్యాయం పై ఇప్పటికే పొరుగు రాష్ట్రాల సంఘాలు మద్దతు తెలిపాయని, మేనేజ్మెంట్ మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు తమకు అనుమానాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. వెంటనే వేతన సవరణ నెరవేర్చాలని కోరారు. ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సంగం రాష్ట్ర అధ్యక్షులు జి బి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు నాగ ప్రసాద్, రత్నాలరావు పలువురు పాల్గోన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: