చిత్తూరు జిల్లా కలకడ పట్టణంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు మహిళపై విచక్షణారహితంగా దాడి చేశారు. కలకడ పట్టణం లోని మంగళపల్లి జాతీయ రహదారి పక్కన ఎర్రయ్య గారి పల్లెకు చెందిన ఆనంద్, తన భార్య శశికళతో ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న కొందరు ఇంట్లోకి చొరబడి మహిళపై దాడి చేశారు. ఈ ఘటనలో భార్య, భర్తలు తీవ్రంగా గాయపడ్డారు. మహిళపై దాడి చేస్తున్న విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయగా కలకడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.