Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra PradeshChittoor వరకట్న దాహానికి వివాహిత బలి..

వరకట్న దాహానికి వివాహిత బలి..

by Rama
darna infront of police station

కర్ణాటక రాష్ట్రం కు చెందిన జ్యోతిక (23) అనే యువతి ని తిరుపతికి చెందిన ధనరాజ్ తో ఏడాది కిందట వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుండి కట్నం పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. ధనరాజ్ కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. జ్యోతిక కుటుంబీకులు మాత్రం తమ బిడ్డను హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డ మృతికి కారణమైన వారిపై చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తూ, ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. బాధితులతో సీఐ మహేశ్వర్ రెడ్డి మాట్లాడి తగిన న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. జ్యోతిక కుటుంబం ఫిర్యాదు మేరకు ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

013769
Total views : 78065

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.