Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Latest News చెరువు ఆక్రమణలపై కొరడా ఝులిపించిన అధికారులు…

చెరువు ఆక్రమణలపై కొరడా ఝులిపించిన అధికారులు…

by Prakash
Sangareddy District

సంగారెడ్డి జిల్లా (Sangareddy District) :

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మెళ్ళ చెరువు ఆక్రమణల పై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు కోరాడ ఝులిపించారు. గత ప్రభుత్వ అండతో మెళ్ల చెరువు లోని FTL ల్యాండ్ ను కబ్జాదారులు ఆక్రమించి పెద్ద ఎత్తున మట్టిని నింపారు. ఆక్రమణలకు పాల్పడిన వారికి వత్తాసు పలుకుతూ మ్యామ్యాలకు అలవాటు పడి చర్యలకు అధికారులు వెనుకంజ వేశారు. చెరువు కబ్జా చేసిన వ్యక్తి ఎవరో తెలిసి కూడ వారి పేరు చెప్పకుండా గుర్తు తెలియని వ్యక్తులు మట్టిని నింపారు అన్నా ఇరిగేషన్ AE ఫిర్యాదు మేరకు రామచంద్రపురం పోలీసుల కేసును సైతం నమోదు చేశారు.
ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు FIR నమోదు చేసి పోలీసు అధికారులు మమా అనిపించి ఆ తరువాత చేతులు దులుపు కున్నారు. చెరువులో ఆక్రమణలపై గతంలో NGT స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన కబ్జాదారుల అమ్యమాలకు అలవాటు పడ్డా అధికారుల ఆక్రమణలపై కళ్ళు మూసుకొని ములిగారు. గత ప్రభుత్వ హయాంలో నేతలకు తొత్తులుగా మారి కబ్జాలకు సహకరించిన అధికారులు పై ఇప్పటికైనా ఉన్నతధికారులు చర్యలు తీసుకోవాలనీ ప్రజలు కోరుతున్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

కబ్జాల పై రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు పలు మార్లు ఫిర్యాదులు అందిన అధికారులు స్పందించకపోవడం పై అప్పట్లో భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. రాజకీయా నాయకులు సైతం కబ్జాదారులకు అండగా నిలిచిన నేపథ్యంలో, నేడు మేళ్ళ చెరువు కబ్జాల పై అధికారులు చర్యలు తీసుకోవడం పట్లా హర్షం వ్యక్తమవుతోంది. గత కొన్ని ఏళ్లుగా మేళ్లచెరువులో సుమారు 10 ఎకరాల మేరకుకబ్జాకు గురవుతున్న విషయం తెలిసిన కూడా అటువైపు చూడని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అటువైపు చూడకపోవడం పలు విమర్శలకు దారి తీస్తుంది. ఇరిగేషన్ శాఖ డీ ఈ రామ స్వామినీ మీడియా ప్రతినిధిలు వివరాలను అడిగితే ఏమీ తెలియనట్లు మొఖం చాటేయడం, కబ్జాదారులకు ఎంతవరకు సహకరిస్తున్నాడో అర్థం అవుతుంది. ఇలాంటి అధికారులు ఉండడం వల్ల రాబోవు రోజుల్లో నియోజకవర్గంలో కొన్ని చెరువులను రికార్డుల్లో తప్ప వాస్తవంగా చూడలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి కఠినమైన ఆదేశాల మేరకు మూడు శాఖల అధికారులు చర్యలు చేపట్టారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. …
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ …
యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.
హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039542
Total views : 198513

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: