Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Latest News చెరువు ఆక్రమణలపై కొరడా ఝులిపించిన అధికారులు…

చెరువు ఆక్రమణలపై కొరడా ఝులిపించిన అధికారులు…

by Prakash
Sangareddy District

సంగారెడ్డి జిల్లా (Sangareddy District) :

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మెళ్ళ చెరువు ఆక్రమణల పై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు కోరాడ ఝులిపించారు. గత ప్రభుత్వ అండతో మెళ్ల చెరువు లోని FTL ల్యాండ్ ను కబ్జాదారులు ఆక్రమించి పెద్ద ఎత్తున మట్టిని నింపారు. ఆక్రమణలకు పాల్పడిన వారికి వత్తాసు పలుకుతూ మ్యామ్యాలకు అలవాటు పడి చర్యలకు అధికారులు వెనుకంజ వేశారు. చెరువు కబ్జా చేసిన వ్యక్తి ఎవరో తెలిసి కూడ వారి పేరు చెప్పకుండా గుర్తు తెలియని వ్యక్తులు మట్టిని నింపారు అన్నా ఇరిగేషన్ AE ఫిర్యాదు మేరకు రామచంద్రపురం పోలీసుల కేసును సైతం నమోదు చేశారు.
ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు FIR నమోదు చేసి పోలీసు అధికారులు మమా అనిపించి ఆ తరువాత చేతులు దులుపు కున్నారు. చెరువులో ఆక్రమణలపై గతంలో NGT స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన కబ్జాదారుల అమ్యమాలకు అలవాటు పడ్డా అధికారుల ఆక్రమణలపై కళ్ళు మూసుకొని ములిగారు. గత ప్రభుత్వ హయాంలో నేతలకు తొత్తులుగా మారి కబ్జాలకు సహకరించిన అధికారులు పై ఇప్పటికైనా ఉన్నతధికారులు చర్యలు తీసుకోవాలనీ ప్రజలు కోరుతున్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

కబ్జాల పై రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు పలు మార్లు ఫిర్యాదులు అందిన అధికారులు స్పందించకపోవడం పై అప్పట్లో భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. రాజకీయా నాయకులు సైతం కబ్జాదారులకు అండగా నిలిచిన నేపథ్యంలో, నేడు మేళ్ళ చెరువు కబ్జాల పై అధికారులు చర్యలు తీసుకోవడం పట్లా హర్షం వ్యక్తమవుతోంది. గత కొన్ని ఏళ్లుగా మేళ్లచెరువులో సుమారు 10 ఎకరాల మేరకుకబ్జాకు గురవుతున్న విషయం తెలిసిన కూడా అటువైపు చూడని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అటువైపు చూడకపోవడం పలు విమర్శలకు దారి తీస్తుంది. ఇరిగేషన్ శాఖ డీ ఈ రామ స్వామినీ మీడియా ప్రతినిధిలు వివరాలను అడిగితే ఏమీ తెలియనట్లు మొఖం చాటేయడం, కబ్జాదారులకు ఎంతవరకు సహకరిస్తున్నాడో అర్థం అవుతుంది. ఇలాంటి అధికారులు ఉండడం వల్ల రాబోవు రోజుల్లో నియోజకవర్గంలో కొన్ని చెరువులను రికార్డుల్లో తప్ప వాస్తవంగా చూడలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి కఠినమైన ఆదేశాల మేరకు మూడు శాఖల అధికారులు చర్యలు చేపట్టారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన …
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు భారీగా తరలివచ్చారు. ప్రజల సమస్యలను త్వరితగతిన …
హైదరాబాద్‍లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎకో సెన్సిటివ్ జోన్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014721
Total views : 80945

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.