వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వ ఏర్పడ్డాక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి రాజంపేట ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి… ఇవాళ ఉదయం తంబళ్లపల్లె నియోజకవర్గం కురబాలకోటలో జరిగిన రోడ్ షోలో తంబళ్లపల్లి ఎన్డీఏ కూటమి టిడిపి అభ్యర్థి దాసరపల్లి జయచంద్ర రెడ్డి, టిడిపి స్టార్ క్యాంపెనియన్ పనబాతు లక్ష్మితో కలిసి ఆయన పాల్గొన్నారు.. అనంతరం జరిగిన పబ్లిక్ మీటింగ్ లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిందని, వైయస్ వివేకానంద రెడ్డి మృతి చెంది ఐదేళ్లు గడిచినా ఇంతవరకు ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదని, సొంత బాబాయ్ కి న్యాయం చేయలేని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇక రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేయగలరని ఆయన ప్రశ్నించారు… ఈ రోడ్ షోలో బిజెపి సీనియర్ లీడర్ చల్లపల్లి నరసింహారెడ్డి కూటమికి సంబంధించిన ముఖ్య నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వైసీపీకి గుడ్బై చెప్పిన చిన్న శ్రీను.ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
- టీడీపీ శ్రేణులకు లోకేశ్ కీలక సందేశం.టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ రాష్ట్రవ్యాప్తంగా ‘నిజం గెలిచింది’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. చంద్రబాబును 53 రోజుల పాటు జైల్లో నిర్బంధించినందుకు నిరసనగా, ఆయన నిర్దోషిగా బయటకు వచ్చినందుకు…
- ఇవాళ కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా పి.గన్నవరం నియోజకవర్గంలోని పండువారిపేటలో జరిగే గ్రామసభలో సీఎం పాల్గొని లబ్ధిదారులకు పట్టాదారు పాస్పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. అంతకుముందు మాచవరం జయంతి నగర్లో…