కడప జిల్లా(Kadapa District) జమ్మలమడుగు(Jammalamadugu)లోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి(Sri Narapura Venkateswara Swamy) బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కల్యాణోత్సవాన్ని వేద పండితులు సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీనారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయానికి పురాతన ప్రాశస్త్యం ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని సౌకర్యాలు కల్పించింది. పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్క గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం…
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.