మాఫియాను సంపూర్ణంగా నిర్మూలిస్తామని మంత్రి దన్నసరి అనసూయ (సీతక్క) అన్నారు.మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిమాట్లాడుతూ….గంజాయి ని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపడుతామని ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ,వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామకాలను భర్తీ చేస్తామన్నారు.విద్యా శాఖలో జిల్లా వ్యాప్తంగా కేవలం ఇద్దరు ఎం.ఈ.ఓ లు విధులు నిర్వహించడాన్ని బట్టి గత పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోందని దీంతో విద్యాశాఖ అద్వానంగా మారిందని ధ్వజమెత్తారు.
మహబూబాబాద్ జిల్లా లోభూకబ్జాదారులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు.అసంపూర్తిగా ఉన్న వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యశాఖ అధికారులు ప్రజల కు అందుబాటులో ఉండి ప్రజా ప్రతినిధులతో కలిసి సమన్వయంగా పనిచేయాలని కోరారు. ఇది తొలి సమావేశం కాబట్టి అధికారులను సున్నితంగా మందలించామని రాష్ట్రంలో డ్రగ్స్ కు బానిసలుగ మారడంతో మహిళలపై అఘాయిత్యాలు… ,త్వరలో మరోసారి సమీక్ష సమావేశం ను నిర్వహిస్తామని తెలిపారు.విధుల పట్ల నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, మహబూబాబాద్ ఎం.పి గా గెలుపొందిన పోరిక బలరాం నాయక్ , ఎమ్మెల్యేలు డాక్టర్. మురళి నాయక్, డాక్టర్ రామచంద్రు నాయక్, కోరం కనకయ్య , ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, మున్సిపల్ చైర్మన్ రాంమోహన్ రెడ్డి , జిల్లా అధికారులు పాల్గొన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…
- విష్ణు గొడవ చేయలేదు … మనోజ్ కావాలనే ఇదంతా చేస్తున్నాడుమంచు మనోజ్ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు తల్లి మంచు నిర్మల. మంచు మోహన్బాబు ఫ్యామిలీ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.