మాఫియాను సంపూర్ణంగా నిర్మూలిస్తామని మంత్రి దన్నసరి అనసూయ (సీతక్క) అన్నారు.మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిమాట్లాడుతూ….గంజాయి ని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపడుతామని ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ,వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామకాలను భర్తీ చేస్తామన్నారు.విద్యా శాఖలో జిల్లా వ్యాప్తంగా కేవలం ఇద్దరు ఎం.ఈ.ఓ లు విధులు నిర్వహించడాన్ని బట్టి గత పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోందని దీంతో విద్యాశాఖ అద్వానంగా మారిందని ధ్వజమెత్తారు.
మహబూబాబాద్ జిల్లా లోభూకబ్జాదారులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు.అసంపూర్తిగా ఉన్న వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యశాఖ అధికారులు ప్రజల కు అందుబాటులో ఉండి ప్రజా ప్రతినిధులతో కలిసి సమన్వయంగా పనిచేయాలని కోరారు. ఇది తొలి సమావేశం కాబట్టి అధికారులను సున్నితంగా మందలించామని రాష్ట్రంలో డ్రగ్స్ కు బానిసలుగ మారడంతో మహిళలపై అఘాయిత్యాలు… ,త్వరలో మరోసారి సమీక్ష సమావేశం ను నిర్వహిస్తామని తెలిపారు.విధుల పట్ల నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, మహబూబాబాద్ ఎం.పి గా గెలుపొందిన పోరిక బలరాం నాయక్ , ఎమ్మెల్యేలు డాక్టర్. మురళి నాయక్, డాక్టర్ రామచంద్రు నాయక్, కోరం కనకయ్య , ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, మున్సిపల్ చైర్మన్ రాంమోహన్ రెడ్డి , జిల్లా అధికారులు పాల్గొన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.UK పర్యటనలో నిరాశపరిచిన తర్వాత భారత్ కోరుకున్న ఫలితం ఇదే. జింబాబ్వే గడ్డపై ఆ జట్టును పూర్తిగా అధిగమించి 3-0 తేడాతో క్లీన్ స్వీప్ పూర్తి చేసింది. వాస్తవానికి ఈ సిరీస్ అంతటా జింబాబ్వే జట్టు భారత్కు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. భారత్…
- మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాగుటూరు పంచాయతీలోని రంగాపురం గ్రామానికి చెందిన 65 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో ఈ భారీ చేరికలు జరిగాయి.…
- రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. తాను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని, ఎన్నికల రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నానని స్పష్టం చేశారు. అయితే, ప్రజా జీవితంలోనే కొనసాగుతూ ప్రజల పక్షాన తన గొంతు వినిపిస్తూనే ఉంటానని…
- నంద్యాల జిల్లాలో నలుగురు ఫారెస్ట్ అధికారుల సస్పెన్షన్.నంద్యాల జిల్లా ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్లో అధికారుల చేతివాటం తీవ్ర కలకలం రేపింది. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న లక్షలాది రూపాయల విలువైన టేకు కలపను ప్రభుత్వ డిపోకు తరలించకుండా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునేందుకు ప్రయత్నించిన ఘటనా స్థానికంగా చర్చనీయాంశంగా…
- సీబీఎస్ఈ, నీట్ నిర్వహణలో కేంద్రం విఫలమైందని ఆరోపణ.సీబీఎస్ఈ, నీట్ వంటి కీలక జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షం, ముఖ్యంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.