కందుకూరు మండలంలో ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్న వాగులు,కుంటలు,గుట్టలు అక్రమార్కుల పాలు అవుతున్నాయి .వాగులల్లో ఉన్న మట్టిని,అసైన్డ్ మెంట్,లావాణి పట్టా భూములలో ఉన్న మట్టిని అక్రమార్కులు రాత్రి పగలు అనే తేడా లేకుండా విచ్చలవిడిగా పాతాళంలోకి గుంతలు తొవ్వుతున్నారు. అక్రమార్కులు ప్రాంతాలలో ప్రకృతి సహజ సిద్ధంగా మట్టితో ఇసుక తయారీ చేసి లక్షలు దండుకుంటున్నారు. అక్రమార్కుల తీరు చూస్తుంటే తోవ్వుకో అమ్ముకో అడిగేవారు లేరు అన్నట్టు ఉంది. నిర్మానుష్య ప్రాంతాలలో ఇసుక ఫిల్టర్ పెట్టి గుట్టుచప్పుడు కాకుండా మట్టిని జల్లెడ పట్టి ఇసుకను తయారు చేస్తున్నారు.
దీనికి నిదర్శనం కందుకూరు మండలంలోని రాచులూరు గ్రామ రెవిన్యూ పరిధిలోని సర్వే నంబర్ 111లో(ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు వాగు ప్రక్కన) గుట్టుచప్పుడు కాకుండా ఫిల్టర్ ఇసుక దందా…!మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా నడుస్తుంది.అటువైపు రెవిన్యూ,ఇరిగేషన్,పోలీస్ శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే మట్టి త్రవ్వకాలు జరిపి ఫిల్టర్ ఇసుక తయారీ చేస్తున్నారు.
వాల్టా చట్టానికి తూట్లు పెడుతున్నారు.రెవిన్యూ,ఇరిగేషన్ శాఖ అధికారులు నిద్ర మత్తులో మునిగిపోతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- అంగరంగవైభవంగా కమర్షియల్ కోర్డ్ రూమ్ డ్రామా ‘డ్యూ డేట్’ చిత్రం ప్రారంభం.పీఆర్ఓగా, జర్నలిస్ట్గా తెలుగు సినీ పరిశ్రమలో అందరికి సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ, మరో నిర్మాత పవన్ తరిగోపులతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘డ్యూ డేట్’ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో…
- త్వరలో విడుదల కానున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ.టాలీవుడ్ తెరపైకి మరో ఆసక్తికరమైన కథ రాబోతుంది. రమేష్ బాబు చెరుకూరు దర్శకత్వంలో బాల బ్రహ్మచారి, శివ బ్రహ్మిణి సమర్పణలో, శివబ్రహ్మేంద్ర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత సావిత్రమ్మ నిర్మిస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి…
- తెలంగాణలో ఉచిత పథకాలపై హైకోర్టు ఫైర్.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతపై హైకోర్టు తీవ్ర సందేహాలను వ్యక్తం చేసింది. శాసనసభ ఆమోదం లేకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఈ పథకాలను ఏ విధంగా అమలు చేస్తారని ప్రశ్నించింది.…
- మమతా బెనర్జీ పార్టీకి ఈడీ షాక్.పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆ పార్టీకి చెందిన మూడు బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు స్తంభింపజేశారు. ఈ ఖాతాల్లో సుమారు 440.42 కోట్ల నిధులు ఉన్నట్లు…
- దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన.రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి విదేశీ పర్యటన కొనసాగుతోంది. దక్షిణ కొరియా పర్యటనలో దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. మొదట ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా సీఈఓ హంగ్ జూ జియోన్,హ్యుందాయ్ మోబిస్ తోనూ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 194324