Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Latest News నిరుద్యోగుల విషయంలోబిఆర్ఎస్ ,కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏమీ లేదు..

నిరుద్యోగుల విషయంలోబిఆర్ఎస్ ,కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏమీ లేదు..

by Rama
నిరుద్యోగుల విషయంలోబిఆర్ఎస్ ,కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏమీ లేదు..

నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ భారతీయ జనతా యువమోర్చా కరీంనగర్ జిల్లా శాఖ నగరంలోని తెలంగాణ చౌక్ లో ఆందోళన చేపట్టింది. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ సర్కార్ అవలంబిస్తున్న వైఖరిని నిర్వహిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న బీజేవైఎం జిల్లా అధ్యక్షులు దురిశెట్టి సంపత్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పట్ల ముసలి కన్నీరు కార్చిందని, నిరుద్యోగులకు చేయూత నిస్తామని నేడు మొండి చేయి ఇచ్చిందని ఆయన విమర్శించారు. నిరుద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. గత పది ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందని, అందుకే ఆ ప్రభుత్వానికి నిరుద్యోగులు తగిన గుణపాఠం చెప్పారన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలకు గడిచిన నిరుద్యోగుల ఏ ఒక్క సమస్యలను పరిష్కరించలేదని, నిరుద్యోగులకు ప్రతినెల అందిస్తామన్న భృతి నేటికీ ఇవ్వలేకపోయిందన్నారు. లోగడ రాష్ట్రాన్ని ఏలిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదన్నారు. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. నిరుద్యోగుల విషయంలోబిఆర్ఎస్ ,కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏమీ లేదు..ప్రధానంగాగ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని, గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలని,25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ నీ నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గల మెత్తిన బీజేవైఎం నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం దాడి చేయించడం అమానుషమని, దీన్ని బీజేవైఎం జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ..టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
    దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
  • పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
  • 22ఏపై బీజేపీ దీక్షలు.
    భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…
  • సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.
    సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
  • భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.
    రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: