నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ భారతీయ జనతా యువమోర్చా కరీంనగర్ జిల్లా శాఖ నగరంలోని తెలంగాణ చౌక్ లో ఆందోళన చేపట్టింది. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ సర్కార్ అవలంబిస్తున్న వైఖరిని నిర్వహిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న బీజేవైఎం జిల్లా అధ్యక్షులు దురిశెట్టి సంపత్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పట్ల ముసలి కన్నీరు కార్చిందని, నిరుద్యోగులకు చేయూత నిస్తామని నేడు మొండి చేయి ఇచ్చిందని ఆయన విమర్శించారు. నిరుద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. గత పది ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందని, అందుకే ఆ ప్రభుత్వానికి నిరుద్యోగులు తగిన గుణపాఠం చెప్పారన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలకు గడిచిన నిరుద్యోగుల ఏ ఒక్క సమస్యలను పరిష్కరించలేదని, నిరుద్యోగులకు ప్రతినెల అందిస్తామన్న భృతి నేటికీ ఇవ్వలేకపోయిందన్నారు. లోగడ రాష్ట్రాన్ని ఏలిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదన్నారు. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. నిరుద్యోగుల విషయంలోబిఆర్ఎస్ ,కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏమీ లేదు..ప్రధానంగాగ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని, గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలని,25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ నీ నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గల మెత్తిన బీజేవైఎం నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం దాడి చేయించడం అమానుషమని, దీన్ని బీజేవైఎం జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ..టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
- హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్పోనాలు…
- అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
- భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…
- చెన్నై ఎగ్మూర్లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీలు.తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 194539