Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Latest News ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటున్న నిరుపేదలు…

ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటున్న నిరుపేదలు…

by Rama
ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటున్న నిరుపేదలు…

35 ఏళ్ల క్రితం అక్కడంతా తుమ్మ పొదలు చెత్త చెదరాలు అక్కడికి వెళ్లాలంటే అంత చిత్తడిగా ఉండేది. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఆ స్థలం పట్టణంలోని నడిబొడ్డున ఉంది. అయినప్పటికీ అప్పుడున్న బతుకులు మాత్రం అలాగే ఉన్నాయి కానీ ఆ ఏరియా మాత్రం లక్షల నుంచి కోట్ల వరకు చేరింది. దీంతో మొన్నటిదాకా నిశ్శబ్దంగా ఉన్న కొందరు కబ్జాదారులు ఈ కాస్ట్లీ స్థలంపై కన్ను పడింది.ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటున్న నిరుపేదలు… ఇంకేముందీ నిరుపేదల కడుపు కొట్టాలని చూస్తున్నారు. పొట్ట చేత పట్టుకుని కూలీ చేసుకుంటూ బతుకుతున్న తమకు ఇల్లు పట్టాలు ఇవ్వాలంటూ తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని కొందరు నిరుపేదలు.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని మార్కండేయ కాలనీ సమీపంలో ఫైర్ స్టేషన్ పక్కనే ఉన్న ఏరియా ఇప్పుడున్న పరిస్థితులలో చదరపు గజానికి లక్షల్లో ధర పలుకుతుంది. దీంతో కబ్జాదారుల కన్ను దీనిపై పడింది. మీకు సహాయం చేస్తామంటూనే కొందరు రాజకీయ నాయకులు నిరుపేదల కడుపు కొట్టె ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నిరుపేదలకు భరోసా కల్పిస్తుంటున్నారు. పొట్ట చేత పట్టుకుని 35 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి కూలీ నాలీ చేసుకుంటూ చిన్నచిన్న ఇల్లు కట్టుకున్న 25 కుటుంబాలు ప్రజలు ఉంటున్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటున్న నిరుపేదలు…అయితే తమకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులను ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు. పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పట్టాలు ఇవ్వాల్సింది పోను నానా రకాలుగా నాయకులు ఇబ్బందులు పెడుతున్నారని అంటున్నారు.కూలీ పనులు చేసుకునే నిరుపేదల కడుపులను కొట్టవద్దని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి మూర్తి అంటున్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో వారికి త్వరలో ఇల్లు కట్టించి కనీస సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
  • అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.
    అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

019456
Total views : 90745

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.