Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Latest News ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటున్న నిరుపేదలు…

ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటున్న నిరుపేదలు…

by Rama
ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటున్న నిరుపేదలు…

35 ఏళ్ల క్రితం అక్కడంతా తుమ్మ పొదలు చెత్త చెదరాలు అక్కడికి వెళ్లాలంటే అంత చిత్తడిగా ఉండేది. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఆ స్థలం పట్టణంలోని నడిబొడ్డున ఉంది. అయినప్పటికీ అప్పుడున్న బతుకులు మాత్రం అలాగే ఉన్నాయి కానీ ఆ ఏరియా మాత్రం లక్షల నుంచి కోట్ల వరకు చేరింది. దీంతో మొన్నటిదాకా నిశ్శబ్దంగా ఉన్న కొందరు కబ్జాదారులు ఈ కాస్ట్లీ స్థలంపై కన్ను పడింది.ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటున్న నిరుపేదలు… ఇంకేముందీ నిరుపేదల కడుపు కొట్టాలని చూస్తున్నారు. పొట్ట చేత పట్టుకుని కూలీ చేసుకుంటూ బతుకుతున్న తమకు ఇల్లు పట్టాలు ఇవ్వాలంటూ తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని కొందరు నిరుపేదలు.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని మార్కండేయ కాలనీ సమీపంలో ఫైర్ స్టేషన్ పక్కనే ఉన్న ఏరియా ఇప్పుడున్న పరిస్థితులలో చదరపు గజానికి లక్షల్లో ధర పలుకుతుంది. దీంతో కబ్జాదారుల కన్ను దీనిపై పడింది. మీకు సహాయం చేస్తామంటూనే కొందరు రాజకీయ నాయకులు నిరుపేదల కడుపు కొట్టె ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నిరుపేదలకు భరోసా కల్పిస్తుంటున్నారు. పొట్ట చేత పట్టుకుని 35 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి కూలీ నాలీ చేసుకుంటూ చిన్నచిన్న ఇల్లు కట్టుకున్న 25 కుటుంబాలు ప్రజలు ఉంటున్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటున్న నిరుపేదలు…అయితే తమకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులను ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు. పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పట్టాలు ఇవ్వాల్సింది పోను నానా రకాలుగా నాయకులు ఇబ్బందులు పెడుతున్నారని అంటున్నారు.కూలీ పనులు చేసుకునే నిరుపేదల కడుపులను కొట్టవద్దని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి మూర్తి అంటున్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో వారికి త్వరలో ఇల్లు కట్టించి కనీస సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
    హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
  • ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
    ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
  • నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
    ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
  • మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
    బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్‌–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
  • ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.
    ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్‌ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: