భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో కురుస్తున్న వర్షానికి పాములేరు వాగులో భారీగా వరదనీరు చేరడంతో వాగు పొంగి ములకలపల్లి ప్రధాన రహదారి అయిన డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. దింతో రెండు రోజుల నుండి సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దింతో తాళ్ళపాయి గ్రామస్థులు రోడ్డుపై నిరసనకు దిగారు. వర్షాకాలం వచ్చిందంటే పాములేరు వాగు పొంగి రోడ్డు మొత్తం కొట్టుకుపోయి ఆ ప్రాంత ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములకలపల్లి నుండి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న వంతెన పనులు ప్రారంభించటానికి ముందు వాహన రాకపోకలు సాగించేందుకు వీలుగా తాత్కాలిక రాహదారి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, కాని కాంట్రాక్టర్ ఆరు నెలల క్రితం ప్రస్తుతం వున్న బ్రిడ్జి ను కూలగొట్టి తూతూ మంత్రంగా తాత్కాలిక అప్రోచ్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికే ఈ రోడ్డు చాల సార్లు కొట్టుకుపోగ శనివారం రాత్రి కురిసిన చిన్న పాటి వర్షానికి పూర్తిగా కొట్టుకుపోయి రహదారి పరిధిలోని రింగు రెడ్డి పల్లి, తాళ్ళపాయ, మంగళిగుట్ట, సుందర్ నగర్ సుమారు 20 గ్రామాలకు మండల కేంద్రంతో రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన నిర్మాణ పనులు చేపట్టి ఆరు నెలలు కావస్తున్నా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయన్న అధికారులు కనీసం పట్టించుకోవడమేలేదని గ్రామస్థులు నిరసన చేస్తున్నారు.ఎంత మంది ఎమ్మెల్యే లు మరీనా తమ ప్రాంతాన్ని పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన్యంలో ఉంటున్న ప్రజలు నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు దారి లేక రెండు రోజులుగా పస్తులుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పదించి వంతెన పనులు వేగవంతం చేయాలనీ 20గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.