ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడుతుండడం రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న వలసలు బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. ఎప్పుడు ఎవరు వెళ్లిపోతారో తెలియక గందరగోళం నెలకొంది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి హస్తం కండువా కప్పుకోవడం ఆ పార్టీని షాక్ కు గురి చేసింది. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన గులాబీ ఎమ్మెల్యేలు , ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్ బాబును కలవడం హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశామని వారు చెబుతున్నారు.. కాంగ్రెస్ లోకి చేరేందుకే భేటీ అయ్యారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ వివేకానంద మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి సెక్రటేరియట్లో మంత్రి శ్రీధర్ బాబు తో భేటీ అయ్యారు. వీరిలో అరికెపూడి గాంధీ, వివేకానంద, కృష్ణారావులకు గతంలో టీడీపీ తో అనుబంధం ఉంది. సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలకు గతంలో కాంగ్రెస్తో అనుబంధం ముంది. ఆరుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి ప్రభుత్వంలో కీలకమైన మంత్రిని సెక్రటేరియట్ లో కలవడం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నుంచి అన్ని రకాల హామీలు లభిస్తే, నేడో, రేపో ఆ ఎమ్మెల్యేలు కూడా హస్తం కండువా కప్పుకోవచ్చనే చర్చ జరుగుతున్నది. అయితే అభివృద్ధి కోసమే తాము మంత్రిని కలిశామని సదరు ఎమ్మెల్యేలు చెబుతున్నా, చేరికలపై వస్తున్న వార్తలను వారు ఖండించకపోవడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. మరోవైపు ఆయా ఎమ్మెల్యేలు శనివారమే సీఎం సమక్షంలో పార్టీలో చేరాల్సి ఉన్నదని, కానీ ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రుల మీటింగ్ నేపథ్యంలో వాయిదా పడిందనే చర్చ కూడా గాంధీభవన్ లో జరుగుతుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…మార్కాపురం జిల్లాలోని పొదిలి నగర పంచాయితీ అభివృద్ధి విషయంలో రోజురోజుకు దిగజారుతోంది. మేజర్ పంచాయితీ నుంచి నగర పంచాయితీగా అప్గ్రేడ్ అయిన తర్వాత అభివృద్ధి వేగం పెరుగుతుందని ప్రజలు ఆశించారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. గత…
- ట్రంప్ను టార్గెట్ నిందితుడి వీడియో వైరల్..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైట్హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వేదికగా జరిగిన ఆ ఘోర కలికి సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియోను యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు విడుదల చేశారు. నిందితుడు కోల్ థామస్…
- మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం..హృదయాన్ని కదిలించే విషాద ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది.బోటు ప్రమాదంలో ఓ తల్లి చూపించిన ప్రేమ.. అందరినీ కంటతడి పెట్టిస్తోంది.కళ్ల ముందు మృత్యువు కనిపిస్తున్నా తన చిన్నారి కొడుకును కాపాడుకోవాలని ఆ తల్లి చివరి క్షణం వరకు పోరాడింది.మరణం అంచున ఉన్నా ఆ…
- అనంతపురం జిల్లాలో ఆర్ఎంపీ డాక్టర్ల దందా..ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్ ఎం పి డాక్టర్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలు చందంగా తయారైంది . అత్యవసర వేళలో ప్రథమ చికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టాల్సిన ఆర్ఎంపీ డాక్టర్లు ఏకంగా ఎంబిబిఎస్ డాక్టర్లతో సమానంగా తెలిసి తెలియని…
- అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..రాజధాని అమరావతిలో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.అమరావతిలో 21 ఎకరాల విస్తీర్ణంలో, సుమారు 750 కోట్ల వ్యయంతో 1000 పడకల సామర్థ్యంతో ఈ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 61981