ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడుతుండడం రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న వలసలు బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. ఎప్పుడు ఎవరు వెళ్లిపోతారో తెలియక గందరగోళం నెలకొంది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి హస్తం కండువా కప్పుకోవడం ఆ పార్టీని షాక్ కు గురి చేసింది. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన గులాబీ ఎమ్మెల్యేలు , ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్ బాబును కలవడం హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశామని వారు చెబుతున్నారు.. కాంగ్రెస్ లోకి చేరేందుకే భేటీ అయ్యారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ వివేకానంద మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి సెక్రటేరియట్లో మంత్రి శ్రీధర్ బాబు తో భేటీ అయ్యారు. వీరిలో అరికెపూడి గాంధీ, వివేకానంద, కృష్ణారావులకు గతంలో టీడీపీ తో అనుబంధం ఉంది. సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలకు గతంలో కాంగ్రెస్తో అనుబంధం ముంది. ఆరుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి ప్రభుత్వంలో కీలకమైన మంత్రిని సెక్రటేరియట్ లో కలవడం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నుంచి అన్ని రకాల హామీలు లభిస్తే, నేడో, రేపో ఆ ఎమ్మెల్యేలు కూడా హస్తం కండువా కప్పుకోవచ్చనే చర్చ జరుగుతున్నది. అయితే అభివృద్ధి కోసమే తాము మంత్రిని కలిశామని సదరు ఎమ్మెల్యేలు చెబుతున్నా, చేరికలపై వస్తున్న వార్తలను వారు ఖండించకపోవడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. మరోవైపు ఆయా ఎమ్మెల్యేలు శనివారమే సీఎం సమక్షంలో పార్టీలో చేరాల్సి ఉన్నదని, కానీ ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రుల మీటింగ్ నేపథ్యంలో వాయిదా పడిందనే చర్చ కూడా గాంధీభవన్ లో జరుగుతుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
- అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి