Wednesday, September 9, 2026
News Navigation
Wednesday, September 9, 2026
News Navigation

Breaking

Wednesday, September 9, 2026
Home Andhra Pradesh ఆర్ధిక సర్వేపై స్పందించే ధైర్యం వైఎస్ జగన్​కు ఉందా?

ఆర్ధిక సర్వేపై స్పందించే ధైర్యం వైఎస్ జగన్​కు ఉందా?

by Satya
ఆర్ధిక సర్వేపై స్పందించే ధైర్యం వైఎస్ జగన్​కు ఉందా ?

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మాజీ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ఆర్థిక సర్వేపై స్పందించే దమ్ము జగన్ కు ఉందా? అని నిలదీశారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా కుప్పకూలిందో ఆర్థిక సర్వే 2022-23 ద్వారా స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. అమరావతి, పోలవరం, నదుల అనుసంధానం, పారిశ్రామిక రంగం, విద్యుత్ ఇలా అన్ని వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్లు విధ్వంసకర పాలన కొనసాగిందని అన్నారు. ఏమీ చేయకుండానే అన్నీ చేసినట్టు గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. అందుకే, ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్పి, తలరాతను తిరగరాశారని యనమల వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో అన్ని రంగాలను నిర్లక్ష్యం చేసి గాలికి వదిలేశారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రులను నరక కూపాలుగా తయారుచేశారని, ఆరోగ్య శ్రీని అనారోగ్య శ్రీగా మార్చివేశారని విమర్శించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
    తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
  • ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.
    తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్‌తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
  • హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.
    హైదరాబాద్‌ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్‌ IREC-2026 హైదరాబాద్‌లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ…
  • వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.
    ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అలియాస్‌ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
  • స్పీకర్‌పై వ్యాఖ్యల వెనుక ఫామ్‌హౌస్ కుట్ర: భట్టి.
    స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్‌హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: