భారతీయుడు-2 సినిమాలో మాదిరి ఫోన్ లో వీడియోలు చూసుకుంటూ నర్సులే వైద్యం చేస్తున్నారు. వైద్యులు లేకపోవడంతో బుచ్చిరెడ్డిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనర్సులే.. డాక్టర్లు అయ్యారు . ఫోన్ లో చూసుకుంటూ వైద్యం చేస్తున్నారు. వారం రోజుల్లో ఒక్కసారి కూడా వైద్య కేంద్రం వైపు వైద్యులు చూడడం లేదని స్థానికులు వాపోతున్నారు. నెల్లూరులోని బుచ్చిరెడ్డిపాలెం పీహెచ్ సీలో సక్రమంగా వైద్యం అందడం లేదని బాధితుడు ఆత్మకూరు శ్రీనివాసులు తెలిపారు. వవ్వేరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు కాలికి చిన్న దెబ్బతలిగింది. వైద్యశాలకు వెళ్లి అడ్మిట్ అయ్యాడు. వారం రోజులు గడిచిన తనను ఒక్క డాక్టర్ కూడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నర్సులు మాత్రమే వైద్యం చేస్తున్నారన్నారు. చిన్నదిగా ఉన్న కాలి గాయం వైద్యం వల్ల తగ్గాల్సింది పోయి, వారం రోజుల్లో మరీ పెద్దదైందన్నారు. 24 గంటల వైద్యశాలలో వైద్యులు సక్రమంగా ఉండడం లేదని స్థానికులు అన్నారు. ఆసుపత్రిలో అన్ని రకాల పరికరాలు ఉన్నా వైద్యులు లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయన్నారు. ఆసుపత్రిలో స్వీపర్గా పనిచేస్తున్న ఆమె ఓపీలు రాయడం, ఫార్మసీలో మందులు తేవడం, సెలైన్లు పెట్టడం ఇంజక్షన్లు చేయడం విశేషమని స్థానికులు, రోగులు తెలుపుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్లో వీఎన్ ఆదిత్య..శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం…
- ఐపీఎల్ 2026 ఫైనల్కు రంగం సిద్ధం..ఐపీఎల్ 2026 సీజన్కు నేడు గ్రాండ్ ఫినాలేతో తెరపడనుంది. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మరోవైపు వ్యూహాత్మక ఆటతో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్.. టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక నరేంద్ర మోదీ…
- కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..సముద్ర గర్భం కుచించుకుపోతోంది. నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర గర్భంలో పాతి పెడుతూ భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఈ దొంగలు సాగిస్తున్న అరాచకాలతో పర్యావరణం పెను ప్రమాదంలో పడుతోంది. కృష్ణా జిల్లా బందరు రూరల్…
- హైదరాబాద్లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ భేటీలో…
- దాసరి నారాయణరావు గారు ఓ ఇన్స్టిట్యూషన్.. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి..దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ను హీరో రాకింగ్ మనోజ్ మంచు, తన సతీమణి భూమా మౌనికతో కలిసి సందర్శించారు. ఈ క్రమంలో దాసరి ఘాట్ దుస్థితిపై యాంకర్ గౌతమి షేర్ చేసిన వీడియోపై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 90110