భారతీయుడు-2 సినిమాలో మాదిరి ఫోన్ లో వీడియోలు చూసుకుంటూ నర్సులే వైద్యం చేస్తున్నారు. వైద్యులు లేకపోవడంతో బుచ్చిరెడ్డిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనర్సులే.. డాక్టర్లు అయ్యారు . ఫోన్ లో చూసుకుంటూ వైద్యం చేస్తున్నారు. వారం రోజుల్లో ఒక్కసారి కూడా వైద్య కేంద్రం వైపు వైద్యులు చూడడం లేదని స్థానికులు వాపోతున్నారు. నెల్లూరులోని బుచ్చిరెడ్డిపాలెం పీహెచ్ సీలో సక్రమంగా వైద్యం అందడం లేదని బాధితుడు ఆత్మకూరు శ్రీనివాసులు తెలిపారు. వవ్వేరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు కాలికి చిన్న దెబ్బతలిగింది. వైద్యశాలకు వెళ్లి అడ్మిట్ అయ్యాడు. వారం రోజులు గడిచిన తనను ఒక్క డాక్టర్ కూడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నర్సులు మాత్రమే వైద్యం చేస్తున్నారన్నారు. చిన్నదిగా ఉన్న కాలి గాయం వైద్యం వల్ల తగ్గాల్సింది పోయి, వారం రోజుల్లో మరీ పెద్దదైందన్నారు. 24 గంటల వైద్యశాలలో వైద్యులు సక్రమంగా ఉండడం లేదని స్థానికులు అన్నారు. ఆసుపత్రిలో అన్ని రకాల పరికరాలు ఉన్నా వైద్యులు లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయన్నారు. ఆసుపత్రిలో స్వీపర్గా పనిచేస్తున్న ఆమె ఓపీలు రాయడం, ఫార్మసీలో మందులు తేవడం, సెలైన్లు పెట్టడం ఇంజక్షన్లు చేయడం విశేషమని స్థానికులు, రోగులు తెలుపుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
- అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి