భారతీయుడు-2 సినిమాలో మాదిరి ఫోన్ లో వీడియోలు చూసుకుంటూ నర్సులే వైద్యం చేస్తున్నారు. వైద్యులు లేకపోవడంతో బుచ్చిరెడ్డిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనర్సులే.. డాక్టర్లు అయ్యారు . ఫోన్ లో చూసుకుంటూ వైద్యం చేస్తున్నారు. వారం రోజుల్లో ఒక్కసారి కూడా వైద్య కేంద్రం వైపు వైద్యులు చూడడం లేదని స్థానికులు వాపోతున్నారు. నెల్లూరులోని బుచ్చిరెడ్డిపాలెం పీహెచ్ సీలో సక్రమంగా వైద్యం అందడం లేదని బాధితుడు ఆత్మకూరు శ్రీనివాసులు తెలిపారు. వవ్వేరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు కాలికి చిన్న దెబ్బతలిగింది. వైద్యశాలకు వెళ్లి అడ్మిట్ అయ్యాడు. వారం రోజులు గడిచిన తనను ఒక్క డాక్టర్ కూడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నర్సులు మాత్రమే వైద్యం చేస్తున్నారన్నారు. చిన్నదిగా ఉన్న కాలి గాయం వైద్యం వల్ల తగ్గాల్సింది పోయి, వారం రోజుల్లో మరీ పెద్దదైందన్నారు. 24 గంటల వైద్యశాలలో వైద్యులు సక్రమంగా ఉండడం లేదని స్థానికులు అన్నారు. ఆసుపత్రిలో అన్ని రకాల పరికరాలు ఉన్నా వైద్యులు లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయన్నారు. ఆసుపత్రిలో స్వీపర్గా పనిచేస్తున్న ఆమె ఓపీలు రాయడం, ఫార్మసీలో మందులు తేవడం, సెలైన్లు పెట్టడం ఇంజక్షన్లు చేయడం విశేషమని స్థానికులు, రోగులు తెలుపుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి. ఈ…
- చిలకా ప్రొడక్షన్స్ థ్రిల్లర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్గా మూవీ గ్రాండ్ రిలీజ్..నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా…
- తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…
- విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
- తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్..తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్ సృష్టించిన సీఎం విజయ్..తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన క్రమశిక్షణ, సమయపాలన అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయంలో విధులకు హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 79188