నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ, తదితర ప్రాంతాల్లో రాత్రి నుండి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. రోడ్లపై వర్షపు నీరు చేరింది, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. 21 వేల క్యూసెక్కుల నీటితో కాలంగి నది ప్రమాదకరంగా మారింది. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు అప్రమత్తం చేసారు. తీర ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
nellore district news
మిచౌంగ్ తుఫాన్ కారణంగా నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూళ్ళూరుపేట మండలం నందు గల కాళంగినది, మరియు పాముల కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. పాముల కాలువ కాదలూరు గ్రామము నకు వెళ్ళు రోడ్డు, తారకేశ్వరా టెక్టైల్ పార్కు కంపెనీ, వట్రపాలం, మన్నారుపోలూరు రోడ్డు ప్రాంతములలో వరద నీరు వచ్చి చేరుకుంది.
బుధవారం ఉదయం ఉలవపాడు ఎన్ జె డి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, సబ్ కలెక్టర్ శోభిక, జడ్పీ సీఈవో చిరంజీవి జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుండి అందిన అర్జీలను నిర్ణీతకాలవ్యవధిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మే 9 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించిందని, అందులో భాగంగానే గ్రామస్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో మండల కేంద్రాల్లో ముందుగానే షెడ్యూలు ప్రకటించి ప్రతి బుధవారం, శుక్రవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రానికి రాలేని గ్రామా ప్రజల సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించడం, సంతృప్తికర స్థాయిలో పరిష్కరించేందుకు మండల కేంద్రాల్లో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉలవపాడు లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. రెవెన్యూ , సర్వే,వారసత్వం భూముల మ్యూటేషన్లు, ఇళ్ల స్థలాలు, రోడ్లు,మౌలిక వసతుల కల్పన మొదలైన సమస్యలపై 80 అర్జీలను ప్రజలు అందజేశారని, నిర్ణీత గడువులోగా ఈ అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు.
ఈ కార్యక్రమంలో నుడావిసి బాపిరెడ్డి, సిపిఓ సాలెం రాజు, హౌసింగ్, డ్వామా పీడీలు నాగరాజు, వెంకట్రావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎంవి సుబ్బారెడ్డి, మైనార్టీ వెల్ఫేర్ అధికారి నిర్మలాదేవి, సమగ్ర శిక్ష ఏపీసి ఉషారాణి, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పలువురు జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Read Also…
Read Also…
ఇందుకూరుపేట మండలం గంగపట్నం పల్లిపాలెం లో ఇటీవల కురిసిన వర్షాలకు పెన్నా వరద నీరు గ్రామంలోకి భారీగా చేరుకుంది. గ్రామస్తులు చొరవ తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. పల్లిపాలెం గ్రామంలోకి వస్తుండటంతో గ్రామస్దులు చొరవ తీసుకొని పెన్నాముఖ ద్వార కట్టను తెగొట్టిన మత్స్యకారులు బకింగ్ హోమ్ కెనాల్ లోని వరద నీరు సముద్రం లోకి వదులుతున్నారు.
కారు బోల్తాపడిన ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి – దుత్తలూరు హైవేపై చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా పామూరు నుంచి కడపకు వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. వారిని వెంటనే 108 వాహనంలో ఉధయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు బోల్తా పడటానికి అతి వేగమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసారు.ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ అర్హులైన మత్స్యకారులకు సీఎం చేతులు మీదుగా సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల భవిష్యత్ కు భరోసాగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన ఉందన్నారు. పులికాట్ ముఖద్వారం పూడికతీత కు 142 కోట్లు ఖర్చుచేసామన్నారు. మత్స్యకారుల ఆరాధ్యదైవం మన సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. 21న జరిగే సభలో నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపు నిచ్చారు.
Read Also…
ఇందుకూరుపేట మండలంలో లేబూరు గ్రామంలో వాలంటీర్, స్థానిక మైనర్ అమ్మాయిని ఎత్తుకెళ్లిన ఘటన. లేబూరు గ్రామంలో వాలంటీర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి సుమారు 15 సంవత్సరాలు వయసు కలిగిన అమ్మాయిని తీసుకెళ్లారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. మైనర్ అమ్మాయి ఉర్దూ పాఠశాలలో విద్యార్థి అనేది సమాచారం ఈనెల ఎనిమిదో తారీకు స్థానిక శాసనసభ్యులు కార్యక్రమం నిమిత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు సమయంలో అమ్మాయిని బైక్ పై తీసుకెళ్లారనేది తల్లిదండ్రులు అనుమానం తీసుకెళ్లిన వ్యక్తి స్థానికంగా లేబూరులో వాలంటీర్ గా పనిచేస్తున్నారనేది సమాచారం ఈ విషయమై స్థానిక ఇందుకూరుపేట పోలీస్స్టేషన్ లో కేసు విచారిస్తున్నారని పోలీసులు తెలిపారు ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జగన్ చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తున్నాము-మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై జిల్లా కార్యాలయంలో… మీడియాతో మాట్లాడిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్ది….పాల్గొన్న జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది, కావలి Mla రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్ది, Mlc చంద్రశేఖర్ రెడ్ది, తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులు…మంత్రి కాకాణి కామెంట్స్.. వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని రేపటి నుంచి పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నాం.. చంద్రబాబు చిన్నాభిన్నం చేసిన వ్యవస్థను జగన్ గాడిలో పెట్టారు.. అధికారంలోకి రాగానే నాలుగు లక్షల 93 వేల మందికి ఉద్యోగాలు అందించాం.. వ్యవసాయ వృద్ధిలో దేశంలోనే ఆరో స్థానానికి ఏపీ వచ్చింది.. స్కూల్స్ డెవలప్మెంట్ కోసం నాడు నేడు ద్వారా 11 వెల 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామ్.. నాలుగేళ్లలో నాలుగు ఓడరేవులు, 10 ఫిషింగ్ బార్బర్స్ ను నిర్మించాం.. మేనిఫెస్టోను మాయం చేసి.. ప్రజలను మోసం చెయ్యడం చంద్రబాబుకీ వెన్నతో పెట్టిన విద్య.. ప్రజలకు చేసిన మంచిని వారికీ తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం.. Dbt ద్వారా ప్రజలకు అందిన సాయాన్ని ప్రజలకు వివరిస్తాం.. పూర్తిగా పార్టీ కార్యక్రమం కావడంతో క్యాడర్ పెద్ద ఎత్తున పాల్గొంటుంది.. టీడీపీ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించి.. జగన్ చేసిన మంచిని గుర్తు చేస్తాం.. వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంట నడిచిన పార్టీ నేతల ఇంటికి వెళ్లి.. వారిని పరామర్శిస్తాం..2024 లో వైసీపీ అధికారంలోకి రావడం కోసం అందరూ గట్టిగ పని చెయ్యాలి.. మాది రైతు ప్రభుత్వం..రైతులకు అండగా ఉంటాం.. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై జిల్లా కార్యాలయంలో… మీడియాతో మాట్లాడిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్ది….పాల్గొన్న జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది, కావలి Mla రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్ది, Mlc చంద్రశేఖర్ రెడ్ది, తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులు… మంత్రి కాకాణి కామెంట్స్.. వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని రేపటి నుంచి పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నాం.. చంద్రబాబు చిన్నాభిన్నం చేసిన వ్యవస్థను జగన్ గాడిలో పెట్టారు.. అధికారంలోకి రాగానే నాలుగు లక్షల 93 వేల మందికి ఉద్యోగాలు అందించాం.. వ్యవసాయ వృద్ధిలో దేశంలోనే ఆరో స్థానానికి ఏపీ వచ్చింది.. స్కూల్స్ డెవలప్మెంట్ కోసం నాడు నేడు ద్వారా 11 వెల 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామ్.. నాలుగేళ్లలో నాలుగు ఓడరేవులు, 10 ఫిషింగ్ బార్బర్స్ ను నిర్మించాం.. మేనిఫెస్టోను మాయం చేసి.. ప్రజలను మోసం చెయ్యడం చంద్రబాబుకీ వెన్నతో పెట్టిన విద్య.. ప్రజలకు చేసిన మంచిని వారికీ తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం.. Dbt ద్వారా ప్రజలకు అందిన సాయాన్ని ప్రజలకు వివరిస్తాం.. పూర్తిగా పార్టీ కార్యక్రమం కావడంతో క్యాడర్ పెద్ద ఎత్తున పాల్గొంటుంది.. టీడీపీ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించి.. జగన్ చేసిన మంచిని గుర్తు చేస్తాం.. వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంట నడిచిన పార్టీ నేతల ఇంటికి వెళ్లి.. వారిని పరామర్శిస్తాం.. 2024 లో వైసీపీ అధికారంలోకి రావడం కోసం అందరూ గట్టిగ పని చెయ్యాలి.. మాది రైతు ప్రభుత్వం..రైతులకు అండగా ఉంటాం..





Total views : 196396