కొడవలూరు మండలం గండవరం గ్రామంలో వెలసియున్న శ్రీ గంగా పార్వతీ సమేత ఉదయ కాళేశ్వర స్వామి దేవస్థానంలో తెల్లవారుజామున చోరీ జరిగింది. ఉదయాన్నే ఆలయానికి వచ్చిన పూజారి చోరీ జరిగిన విషయాన్ని గమనించి ఈవోకు సమాచారం అందించారు. శివాలయం మరియు గంగమ్మ వారి దేవస్థానంలో రెండు హుండీలను పగలగొట్టి నగదు మరియు అమ్మవారి మంగళ సూత్రాలను గుర్తు తెలియని దుండగులు అపహరించినట్లు ఈఓ ప్రసాద్ తెలిపారు. వాటి విలువ సుమారు రెండు లక్షల రూపాయలు విలువ ఉంటుందని ఆయన తెలియజేశారు. చోరీ చేసిన హుండీని పక్కనే ఉన్న పొలాల్లో దుండగులు పగలగొట్టి అక్కడే వదిలి వెళ్ళిపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మరియు క్లూస్ టీం వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎంతో ప్రసిద్ధి గాంచిన ఆలయం వద్ద వాచ్ మెన్ లేకపోవడంతోనే చోరీ జరిగిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
ఉదయ కాళేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ…
320
previous post






Total views : 196983