హన్మకొండ జిల్లాలో కలకలం రేపుతున్న వరుస చోరీలు . పలు కాలనీల్లో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో ఇండ్లలోకి చొరబడడం స్థానికంగా కలకలం రేపుతోంది. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని శ్రీనివాస్ నగర్ లో మహిళలు రాత్రంతా భయంతో నిద్రపోకుండా ఇండ్ల ఎదుట కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. పురుషులంతా కర్రలతో కాలనీలో తిరుగుతూ గస్తీలు కాస్తున్నారు. హిందీ భాష మాట్లాడుతున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట ఇళ్లల్లోకి చొరబడి బెదిరించారని పలువురు కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండ్లలోకి వచ్చి బెదిరిస్తున్న సమయంలో చుట్టుపక్కల కాలనీవాసులు అప్రమత్తమై కేకలు వేస్తూ వారిని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో పరారయ్యారన్నారు. మధ్యాహ్నం వేళ కాలనీల్లో సంచరిస్తూ తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకుంటున్నరన్నారు. గ్రామంలోని పశువుల ఆస్పత్రి, చేపల మార్కెట్ లను రాత్రివేళ స్థావరాలుగా చేసుకొని పక్కా ప్రణాళికతో దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తుల సంచారాన్ని పోలీసులు కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్లో వీఎన్ ఆదిత్య..శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం…
- ఐపీఎల్ 2026 ఫైనల్కు రంగం సిద్ధం..ఐపీఎల్ 2026 సీజన్కు నేడు గ్రాండ్ ఫినాలేతో తెరపడనుంది. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మరోవైపు వ్యూహాత్మక ఆటతో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్.. టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక నరేంద్ర మోదీ…
- కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..సముద్ర గర్భం కుచించుకుపోతోంది. నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర గర్భంలో పాతి పెడుతూ భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఈ దొంగలు సాగిస్తున్న అరాచకాలతో పర్యావరణం పెను ప్రమాదంలో పడుతోంది. కృష్ణా జిల్లా బందరు రూరల్…
- హైదరాబాద్లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ భేటీలో…
- దాసరి నారాయణరావు గారు ఓ ఇన్స్టిట్యూషన్.. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి..దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ను హీరో రాకింగ్ మనోజ్ మంచు, తన సతీమణి భూమా మౌనికతో కలిసి సందర్శించారు. ఈ క్రమంలో దాసరి ఘాట్ దుస్థితిపై యాంకర్ గౌతమి షేర్ చేసిన వీడియోపై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Total views : 89905