Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Telangana వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయం

వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయం

by Rama
వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయం

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీలపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారంటీలను చాలా వరకూ అమలు చేశామని తెలిపారు. తెలంగాణ ప్రజలు 11 నెలల్లోనే మెరుగైన పాలన చూశారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్షమనేది లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత కేవలం ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు.

వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయం అని వ్యాఖ్యానించారు. మూసీ ప్రక్షాళనతో భవిష్యత్తు తరాలు బాగుంటాయని చెప్పారు. మూసీ నది ప్రక్షాళనపై ఎలాంటి అనుమానాలు వద్దని.. అన్నింటిని నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ నెల 19న వరంగల్‌లో నిర్వహించే విజయోత్సవ సభకు ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపు నిచ్చారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014789
Total views : 81037

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.