నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా ఆసక్తికరమైన సినీ అనుభూతిని అందించినట్టు ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తోంది.ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా మే 29న భారీ స్థాయిలో థియేటర్లలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజీవ్ చిలక, మేఘా చిలక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా శనివారం విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది.
‘మరీచిక’ ట్రైలర్ను గమనిస్తే ఎమోషన్స్తో పాటు మిస్టరీ అంశాలతో ప్రారంభమైంది. ఇందులో వెంకట లక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించారు. సంజు పాత్రలో విరాజ్ అశ్విన్ కనిపించగా.. మరీచిక పాత్రలో రెజీనా కసాండ్రా కనిపించారు. సంజుని మరీచిక చంపేసిందంటూ అనుపమ పరమేశ్వరన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం.. ఆ తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్.. తర్వాత సంజు పాత్రను పరిచయం చేయటం.. తర్వాత మరీచిక పాత్రను పరిచయం చేయటం.. ఏ పాత్రకు ఆ పాత్ర మరో పాత్రతో సంబంధం ఉన్నట్లు, లేనట్లు చూపించి సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశారు. ఎన్నారై అమ్మాయి మరీచిక పాత్రలో రెజీనా కనిపించింది. ఈ మూడు పాత్రల మధ్య జరిగిన ఎమోషనల్, థ్రిల్లింగ్ ట్విస్టులు, టర్నులతో సినిమా ఉండనుందని ట్రైలర్తో తెలుస్తోంది.
కథ ముందుకు సాగేకొద్దీ పాత్రల మధ్య ఉన్న సంబంధాలు మారిపోతూ కనిపించాయి. అలాగే భావోద్వేగాలను చూపిస్తూనే సన్నివేశాలు అనుమానాల వైపు దారితీస్తూ కనిపించాయి. అనుపమ పరమేశ్వరన్ పోషించిన పాత్ర, విరాజ్ అశ్విన్చ రెజీనా కసాండ్రా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని చూసిన తర్వాత పూర్తిగా మారిపోతుంది. మొదట మృదువైన ప్రేమకథలా ప్రారంభమైన ఈ కథ, క్రమంగా ఉత్కంఠ, భావోద్వేగ వేదన, అనూహ్య మలుపులతో నిండిన థ్రిల్లర్గా మారుతుంది. ట్రైలర్లో కీలకమైన కథాంశాలను బయటపెట్టకుండా, ప్రతి పాత్ర చుట్టూ ఒక మిస్టరీ ఉన్నట్టు కనిపించటం ప్రత్యేక ఆకర్షణగా అనిపిస్తోంది.
ట్రైలర్ రెండో భాగంలో మరింత ఉత్కంఠభరితమైన దృశ్యాలు, హత్య దర్యాప్తు ఆసక్తిని పెంచుతున్నాయి. అసలు సంజూను ఎవరు హత్య చేశారు? మరీచిక ఎవరు? వారి జీవితాల్లో జరుగుతున్న పరిణామాలకు ద్రోహమే కారణమా? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పోలీస్ దర్యాప్తు, భావోద్వేగ ఘర్షణలు, మిస్టరీ సన్నివేశాలు ఈ కథలో సైకలాజికల్, రివేంజ్ డ్రామా ఉండబోతుందనే సంకేతాలు ఇస్తున్నాయి. ప్రేక్షకులను ఉత్కంఠలో ఉంచే థ్రిల్లర్ను మన ముందుకు రానున్నట్లు స్పష్టమవుతోంది.
లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా అందించిన సంగీతం.. నేపథ్య సంగీతం ట్రైలర్ మొత్తం ఉత్కంఠను, భావోద్వేగ తీవ్రతను మరింత పెంచాయి. ఆకట్టుకునే కథ, కథనం, ఎమోషనల్ యాక్టంగ్, సస్పెన్స్తో కూడిన నెరేషన్ను చూస్తుంటే మరీచిక తెలుగు ప్రేక్షకులకు థియేటర్లలో ఒక కొత్త, ఉత్కంఠభరితమైన సినీ అనుభూతిని అందించబోతుందనిపిస్తోంది.






Total views : 78773