34
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యనభ్యసించిన సాయి వినీల్ ఆల్ ఇండియా స్థాయిలో రెండవ ర్యాంకింగ్ సాధించడం హర్షణీమన్నారు. దాదాపు పదిమంది విద్యార్థులు వందలోపు ర్యాంకులు సాధించి విశ్వభారతి కీర్తి ప్రతిష్టలను మరోసారి ఇనుమడింపజేశారని పొట్లూరి శ్రీమన్నారాయణ అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్లూమ్స్ ఇంచార్జ్ పాల్గొన్నారు.






Total views : 90594