168
న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. దేశ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు ప్రధానిగా సేవలందిస్తున్న నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వ ప్రతిభను, దేశానికి తెచ్చిన అంతర్జాతీయ గుర్తింపును కొనియాడుతూ సభలో కృతజ్ఞతా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడిగా మోదీ లభించారని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన అందిస్తున్న మద్దతుకు సీఎం ధన్యవాదాలు తెలియజేశారు.