36
మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలో పర్యావరణ పరిరక్షణకు సింగరేణి సంస్థ మరోసారి తన నిబద్ధతను చాటుకుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ మార్గదర్శకత్వంలో ‘మాసివ్ ప్లాంటేషన్ డ్రైవ్’ను ఘనంగా నిర్వహించారు. ఏరియా నర్సరీలో జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒకే రోజు 500 మొక్కలను నాటి పచ్చని భవిష్యత్తు కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బొగ్గు ఉత్పత్తితో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో సింగరేణి దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆయన అన్నారు. కార్యక్రమంలో అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రతిజ్ఞ చేశారు.




Total views : 223651