ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతల అరెస్టులను ఖండిస్తూ… నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా, రాస్తారోకో నిర్వహించింది. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన నీట్ పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని… నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, విద్యార్థుల భవిష్యత్తు రక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ అరెస్ట్ను ఖండిస్తూ కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నిరసన.
29
previous post




Total views : 223594