30
నంద్యాల జిల్లా, ఆత్మకూరు అటవీ డివిజన్లో నాలుగు పులి కూనలు హల్చల్ చేశాయి. నల్లకాల్వ గ్రామానికి చెందిన కొందరు కూలీలు శ్రీశైలం కుడిగట్టు ప్రధాన విద్యుత్ టవర్ కింద పొదలు శుభ్రం చేసే పనికి వెళ్లారు. వెలుగోడు అటవీ రేంజ్ పరిధిలోని ఆ పొదల్లో వారు పనిచేస్తుండగా ఒక్కసారిగా పెద్ద పులి ప్రత్యక్షమైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే పొదల నుంచి ఒకదాని వెంట ఒకటిగా నాలుగు పులి కూనలు బయటకు వచ్చాయి.అయితే కూనలతో పాటు ఉన్న పెద్ద పులి చూసిన కూలీలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పనులు నిలిపివేసి అక్కడి నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలను కూలీలు సెల్ ఫోన్లో ఫోటోలు తీశారు.




Total views : 223594