Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Crime కన్నతండ్రిని హతమార్చిన కొడుకు…

కన్నతండ్రిని హతమార్చిన కొడుకు…

by Prakash
A son who killed his own father

పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధి లోని పూసాల గ్రామం లో తీగల నరసయ్య తీగల రాజేశం అనే తండ్రి కొడుకుకులు నివాసం ఉంటున్నారు. అయితే వాళ్ళు పండించిన పంటను విక్రయించేందుకు పూసాలలోని ఐకెపి సెంటర్ కి తీసుకెళ్లారు. అనంతరం పూసాలలోని ఐకెపి సెంటర్లో ధాన్యం విక్రయిస్తుండగా తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తీగల నరసయ్య కొడుకు ఆవేశానికి లోనై య్యాడు. క్షణికా వేశంలో విచక్షణ కోల్పోయిన కొడుకు కన్న తండ్రిని పక్కనే ఉన్న బండరాయితో తల పైన బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావానికి గురైన తీగల నరసయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కాగా తీగల నరసయ్య మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం తరలించి హత్యకు గల కారణాలను సేకరిస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

013851
Total views : 78190

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.