Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh బొజ్జల సుధీర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

బొజ్జల సుధీర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

by Rama
bojjala sudheer reddy

వైయస్సార్సీపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాదాపు నాలుగున్నర సంవత్సరంలో పేదలు, రైతులు ఇలా ఒకరిని కాకుండా ఎవరిది పడితే వారిది అక్రమంగా భూములు లాక్కొని తమ బినామీలకు సొంతం చేశారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ఆరోపించారు టిడిపి శ్రీకాళహస్తి ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని అన్ని మండలాలలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తమ అనుచరులతో బినామీల రూపంలో కోట్లకు పడగలెత్తారని, పేద రైతుల డీకేటీ పట్టాలు ఉన్న వాటిని రైతులను బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి తమ అనుచరుల పేరుమీద అక్రమంగా రాయించుకుంటున్నారని ఆరోపించారు. ఒక్క రేణిగుంట మండలంలోనే దాదాపు 500 కోట్లకు పైగా భూకబ్జాకు పాల్పడ్డారని ఆధారాలతో సహా తమ వద్ద ఉన్నాయని అన్నారు. ఇందులో అధికారులకు అందరికీ పాత్ర ఉందని దీనిపై ప్రజలు ముందుకు వచ్చి పోరాడితే కానీ న్యాయం జరగదని, మీడియాను సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని మండి పడ్డారు.

Advertisements

You may also like

Our Visitor

013867
Total views : 78230

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.