Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Andhra Pradesh తుపాను పై నరేంద్ర మోదీకి చంద్రబాబు లేఖ

తుపాను పై నరేంద్ర మోదీకి చంద్రబాబు లేఖ

by Satya
chandrababu

మిచాంగ్ తుపానుతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని కోరుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. తుపాను కారణంగా రాష్ట్రంలో 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ప్రాణ ఆస్తినష్టం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను తీవ్రత దృష్ట్యా మిచాంగ్ ను జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం చేయాలని కోరారు. ప్రాథమిక అంచనా ప్రకారం 22 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు నష్ట పోయారన్నారు. తుపాను రూ. 10 వేల కోట్ల వరకు పంట నష్టం ఉంటుందని ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు. దాదాపు 770 కిలోమీటర్ల మేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. తాగునీరు, నీటిపారుదల, విద్యుత్, కమ్యూనికేషన్ రంగాలతో పాటు ఆక్వా రంగం కూడా నష్టపోయిందని తెలిపారు. పంట నష్టపోయామనే ఆవేదనతో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని లేఖలో తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

025426
Total views : 147253

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.