కాకినాడ జిల్లా జగ్గంపేట కిర్లంపూడి మండలం రాజుపాలెంలో దళిత యువకులు రోడ్లను నిర్బంధించారు. రాజుపాలెం వీరవరం రోడ్డు విషయంలో 20 రోజుల క్రితం R&B, దళిత యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నాయి. R&B ఈఈ వెంకటేశ్వర ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు FIR నమోదు చేశారు. అయితే తమను కులం పేరుతో దూషించాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా.. కేసు నమోదు చేయలేదంటూ దళిత యువకులు ఆరోపణలు చేశారు. సామర్లకోట కిర్లంపూడి రోడ్డును నిర్బంధించి యువకులు తమ నిరసన తెలియజేశారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి జగ్గంపేట సిఐ లక్ష్మణరావు, కిర్లంపూడి ఎస్సై ఉమామహేశ్వరరావు చేరుకున్నారు.
East Godavari
దేశమంతటా 500 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్టకు గ్రామ గ్రామాన ఎంతో ఉత్సాహభరితంగా, ఆనంద ఉల్లాసాలతో అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ రోజు తెల్లవారుజాము 5 గంటల నుంచి నగర సంకీర్తన ప్రతి ఇంటి ముందు శ్రీరామ్ జయరాం రంగవల్లికలతో అలంకరించుకుని సుందరకాండ పారాయణము శ్రీరామ నామ జపము లాంటివి గోకవరంమండలంలో ప్రతి ఆలయం వద్ద చాలా భక్తితో జరిపించుకున్నారు. గోకవరం పట్టాభి రామాలయం నుంచి 40 గ్రామాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీరాముల ఉత్సవ విగ్రహాలను గ్రామాలలో వీధి వీధినా ఊరేగించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విక్షేంచే విధాంగా అయోధ్య లో జరిగే ప్రతి ఎల్.ఇ.డి తెరలపై చూపించారు. 10 వేలమందికి పైగా అన్న సమారాధన కార్యక్రమలు జరిగాయి.
సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఈతకోట గ్రామంలో పనులు లేక కర్రి వారికి కుటుంబం వలసపోతున్న క్రమంలో రావులపాలెం వద్ద ఏమీ తోచని స్థితిలో ఉన్న కుటుంబానికి ఓ బాలిక దారి చూపి కోప్పవరం గ్రామం చేర్చి ఇక్కడ భూమి సస్యశ్యామలం అయిందని ఇక్కడే పనులు చేసుకుంటూ జీవించండి అంటూ బాలిక అంతర్ధానమైంది. దీనితో ఆ కుటుంబం ఆ బాలికను దేవతగా కొలుస్తూ వస్తున్నారు. ఐదుగురు వ్యక్తులు ఉన్న నాటి కర్రి వారి కుటుంబం సుసంపన్నంగా వేల సంఖ్య కు చేరుకున్నారు. అంతేకాకుండా అమ్మవారు మీరు పండించిన పంటలకు కాపలా కాస్తూ వారికి అండగా నిలుస్తుంది. నాటినుండి నేటి వరకు ప్రతి రెండేళ్లకోసారి కర్రి వారి వంశీయులు సత్తెమ్మ తల్లి ఆడపడుచును కొలుస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు కొనసాగుతాయి. ఉత్సవాల సందర్భంగా మొదటిరోజు మిద్దె పైన కత్తిరి కుండను కిందకు దింపడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇలా దించిన కత్తెర కుండను సంతానం లేని మహిళల తలపై ఉంచితే సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అదేవిధంగా జాతర ప్రారంభం సందర్భంగా అమ్మవారికి మేక గొర్రె, గొర్రె పిల్లలు కానుకగా సమర్పిస్తారు. ఇక్కడ బలి నిషేధం కావడంతో అమ్మవారికి కానుకలుగా వచ్చిన గొర్రెపిల్లలను వేలం ద్వారా విక్రయిస్తారు. రెండవ రోజున ఊరి పొలిమేరలో ఉన్న పుట్ట వద్దకు వెళ్లి అమ్మవారి ప్రతిరూపంగా ఉన్న నాగదేవతను పూజిస్తారు. ఈ పూజ కి వెళ్లే భక్తులు రకరకాల వేషాలు ధరించి అమ్మను కొలుస్తారు. పుట్ట నుండి గుడికి వచ్చిన క్రమంలో భక్తులు పూజారులను ఆలయంలోకి వెళ్లకుండ అడ్డు కుంటారు. దీంతో కోపోద్రిక్తులైన పూజారులు భక్తులపై జకులతో దండెత్తి బడిత పూజ చేస్తారు. ఇలా దెబ్బలు తింటే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. అదేవిధంగా మూడో రోజు ఆఖరి రోజైన సోమవారం జాతరలో చిత్ర విచిత్ర లతో అమ్మవార్ల జాతర్లు సాధారణంగా రాత్రి సమయాల్లో జరుగుతాయి. కానీ ఇక్కడ మాత్రం వెన్నెల లేకుండానే పట్టపగలు జరగడం ఓ విశేషం. అదేవిధంగా కోరికలు తీరిన భక్తులు సాధారణంగా తమకున్న సంపద నుండి కానుకలు సమర్పించడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం భక్తులు జాతరలో ఏదో ఒక వేషం ధరించి భిక్షాటన చేయాలి ఇలా భిక్షాటన చేయగా వచ్చిన బియ్యం, నగదు కానుకలను అమ్మవారికి సమర్పించాలి. దీంతో భక్తులు రకరకాల వేషాలు ధరించి జాతరలో భిక్షాటన చేయడంతో సందడి వాతావరణం నెలకొంది. ధనిక, పేద కుల మత విభేదాలు లేకుండా ప్రతి భక్తుడు భిక్షాటన చేస్తూ ఉండడంతో గ్రామమంతా బిచ్చగాళ్ళ మయంగా మారింది. ఈ వింతను చూసేందుకు వివిధ జిల్లాల నుండి భక్తులు రావడంతో గ్రామమంతా కిటకిటలాడింది. ఇలా భిక్షాటన చేసిన వారిలో కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఉన్నారు. అదేవిధంగా కొన్ని బండ్ల పై వేషాలు కూడా ఆకట్టుకున్నాయి పుష్ప సినిమా స్పూఫ్ తో భక్తులు చేసిన నటన జాతరకు హైలెట్ గా నిలిచింది.
దేశమంతటా 500 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్టకు గ్రామ గ్రామాన ఎంతో ఉత్సాహభరితంగా, ఆనంద ఉల్లాసాలతో అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట వేడుకలు జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగా పి గన్నవరంలో ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి నగర సంకీర్తన ప్రతి ఇంటి ముందు శ్రీరామ్ జయరాం రంగవల్లికలతో అలంకరించుకుని సుందరకాండ పారాయణము శ్రీరామ నామ జపము లాంటివి గన్నవరం మండలంలో ప్రతి ఆలయం వద్ద చాలా భక్తితో జరిపించుకున్నారు. పి గన్నవరం పట్టాభి రామాలయం నుంచి గ్రామాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీరాముల ఉత్సవ విగ్రహాలను గ్రామాలలో వీధి వీధినా ఊరేగించారు. అలాగే ఈరోజు ముంగండ గ్రామంలో అయోధ్యకర సేవకులకు ఘన సత్కారం చేశారు. ప్రతి రామాలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమలు జరిగాయి.
అయోధ్య రామ మందిరం నిర్మాణం, శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో శ్రీ రామాలయం లో కాకినాడ జిల్లా బిజెపి కార్యదర్శి కాళ్ళ ధనరాజ్, నాయకులు సత్యనారాయణ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలతో శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని లైవ్ లో తిలకించారు. ఈ సందర్భంగా ధనరాజ్ మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య దైవం అయిన శ్రీ రాముని దేవాలయ నిర్మాణం చారిత్రక ఘట్టం అయితే ఈ రోజు శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఇంతటి మహోత్తర కార్యక్రమం దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగటం ప్రతి హిందువు గర్వించదగిన విషయమన్నారు. ఎన్ని అవాంతరాలు ఎన్ని అవరోధాలు ఎదురైన అయోధ్య లో రామాలయం నిర్మించడం తో దేశ ఖ్యాతి ప్రపంచ నలుదిశలా వ్యాపించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏనుగుల దొరబాబు, పేదిరెడ్ల దుర్గ బాబు, సత్యనాందం, ఎన్.దొరబాబు, ఊట రాంబాబు, ఎన్.కృష్ణమూర్తి , గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
యావత్తు ప్రపంచం అయోధ్య రాముడు వైపు చూస్తోంది. ఈ నెల 22న అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. అంతా రామమయం జగమంతా రామమయం అంటూ నినాదాలు మర్మోగిపోతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి మూడు రోజులపాటు శోభాయాత్రలు, రామాలయాలలో భజనలు, పూజలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్టు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు, నరసాపురం పార్లమెంట్ ఇంచార్జ్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 22వ తేదీన సెలవు ఇవ్వకపోవడం దారుణమని మాలకొండయ్య అంటున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలో రాజోలు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్యకర్తలు గౌరవ వేతనం వద్దు కనీస వేతనం ముద్దు అంటూ సిఐటియు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 39 రోజులు నుంచి విరామం లేకుండా శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తున్నటువంటి తమకు ఫోకస్ నోటీసులు జారీ చేసి తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఆరుసార్లు చర్చలకు పిలిచి తమకు ఎటువంటి న్యాయం చేయలేదని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ వర్కర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కి వినిపించడం లేదా అక్కా చెల్లెళ్ళు ఆడపడుచులు చేస్తున్నటువంటి సమ్మె జగన్మోహన్ రెడ్డి కి కనిపించడం లేదా అని రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెబుతాం అని అంగన్వాడి వర్కర్స్ వాపోతున్నారు.
తెలుగుదేశంపార్టీ ఆదేశాలతో కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ రూరల్ మండలం ఇంద్ర పాలెం గ్రామంలో పిల్లి అనంతలక్ష్మి సత్యనారయణ మూర్తి కళ్యాణ మండపంలో టి.డి.పి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో జయహో బీసీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజి మంత్రి పితాని సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ బిసి సాధికార శెట్టి బలిజ విభాగం కుడిపుడి సత్తిబాబు, కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి లాల్ పులే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి సముచిత స్థానం తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు ఎన్టీఆర్, చంద్రబాబు కల్పించారన్నారు. వైసిపి పాలనలో బీసీలు వెనకబడి పోయారని, బీసీ సంక్షేమానికి ఆనాడు చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు, వివిధ కార్పొరేషన్ ల ద్వారా చేయూత అందించారని, నేడు రాష్ట్ర ప్రభుత్వం అవి అన్నీ అమలు చేయకుండా బీసీలను చిన్న చూపు చూస్తోందన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా బీసీలు అందరు ఎకతాటిపైకి వచ్చి తెలుగుదేశం పార్టీ కి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు చొలంగి వేణుగోపాల్, టిడిపి నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, చప్పిడి వెంకటేశ్వరరావు, రామకృష్ణ, అధిక సంఖ్యలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం పోతవరంలో మాదిగ జెఏసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా మాదిగ పొలిటికల్ జెఏసి గౌరవ అధ్యక్షుడు ఆకుమర్తి చిన్నా పీసి పాయింట్స్ మాట్లాడారు. కోనసీమలో సామాజిక న్యాయం జరగడం లేదని ఆకుమర్తి అన్నారు. సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ కోనసీమలో మాదిగలు చేస్తున్న పోరాటానికి ఇతర కులాలు కూడా మద్దతివ్వడం శుభపరిణామని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచి ఇప్పటి వరకూ కోనసీమలో మాదిగ సామాజిక వర్గానికి ఏ రాజకీయ పార్టీ రాజకీయ ప్రాధాన్యం కల్పించకపోవడం బాధాకరమని అన్నారు. అన్ని పార్టీలు మాదిగ లను మోసం చేస్తున్నాయని, మాదిగ సామాజిక వర్గానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికలలో కోనసీమ నుండి రెండు ఎమ్మెల్యే స్థానాలు గానీ ఒక ఎంపీ స్థానాన్ని కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికలలో మాదిగలకు సీట్లు కేటాయించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, రేపు విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. కానీ దళిత గిరిజనులకు రావాల్సిన రూ.70 వేల కోట్ల నిధులు కాజేసి, రూ.4 వందల కోట్లతో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడాన్ని మేము స్వాగతించబోమని, దళిత గిరిజనుల కోసం కేటాయించిన 70వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయని సూటిగా ప్రశ్నిస్తున్నమని అన్నారు. మాల, మాదిగ, రెల్లి మూడు కార్పొరేషన్లకు నిధులు ఎందుకు కేటాయించలేదని, కేంద్ర ప్రభుత్వం మాదిగలకు కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం కాజేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. దళితులను చంపిన నాయకులను మీ వెంట తిప్పుకోవడం బాధాకరమని, మాకు న్యాయం జరగనప్పుడు ఈ విగ్రహాలు ఎందుకని జెఏసి నాయకులు ప్రశ్నించారు. మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కోసం ఈ నెల 28న పి.గన్నవరంలో తలపెట్టిన “హలో మాదిగ- ఛలో గన్నవరం” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకుమర్తి చిన్నా పిలుపునిచ్చారు.




Total views : 92742