రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఈ రోజు దాచేపల్లి లైబ్రరీ సెంటర్ నుండి బంగ్లా సెంటర్ వరకు మున్సిపల్ కార్మికులు కాగడాల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని నినాదాలు చేశారు. గత 12 రోజులుగా కార్మికులు రోడ్లమీద ఉన్నా గాని ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఎవరిని నిలబెట్టాలని మంతనాలు చేస్తూ బిజీగా ఉంటుంది తప్పితే కార్మికుల సమస్యలు పట్టించుకుని కార్మికుల సమ్మె డిమాండ్లను పరిష్కరించాలని చూడటం లేదు అని అన్నారు. దాచేపల్లి నగర పంచాయతీలో కూడా మున్సిపల్ కమిషనర్ అధికార పార్టీకి మడుగుల ఒత్తుతూ కార్మికులపై పోలీసులను ఉపయోగించి బెదిరింపులకు గురిచేయాలని చూస్తున్నారని అలాగే సమ్మెలో ఉన్న కార్మికుల ఇళ్ల దగ్గరికి వెళ్లి బెదిరింపులు గురి చేస్తున్నారని అన్నారు. కార్మికులను బెదిరింపులకు గురి చేస్తేమీ అవినీతి చిట్ట్టాలు మొత్తం బయట పెడతామని కార్మిక నాయకులు హెచ్చరించారు.
Guntur
వైసీపీ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలను మారుస్తుండటం తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది. తాజాగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకి అదే స్థానం నుంచి టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ నిరాకరించారు. గుంటూరు నుంచి పోటీ చేయాలని ఆయనకు సూచించారు. అయితే, తాను గుంటూరు నుంచి పోటీ చేయలేనని జగన్ కు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. నరసరావుపేట ఎంపీ స్థానం నుంచే లావుకు టికెట్ ఇవ్వాలని ఆ నియోజకవర్గ పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం చెప్పినప్పటికీ జగన్ నిరాకరించారు. దీంతో, గుంటూరు నుంచి తాను పోటీ చేయలేనని, ఎన్నికల్లో పోటీ నుంచి తాను తప్పుకుంటానని లావు స్పష్టం చేశారు. నరసరావుపేట టికెట్ ను బీసీలకు ఇవ్వాలనుకుంటున్నట్టు జగన్ చెప్పినట్టు తెలుస్తోంది.
Read Also..
గుంటూరు ఎంపీ ఎన్నికల బరిలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు నియామకం చేసేందుకు వైసీపీ కసరత్తు. ఎంపీ మార్పు పై ఆసక్తి చూపని నరసరావు పేట పార్లమెంట్ ఎమ్మెల్యేలు. నరసరావు పేట ఎంపీ స్థానాన్ని బిసి వర్గాలకి ఇస్తే అన్ని నియోజకవర్గాల్లో పట్టు సాధించవచ్చని వైసీపీ అధిష్టానం యోచన. సీఎం జగన్ మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరిన ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు. నరసరావు పేట పార్లమెంట్ లో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు. గుంటూరు పార్లమెంట్ కి వస్తే తాడికొండ, మంగళగిరి లాంటి నియోజకవర్గాల్లో అసంతృప్తి సెగ తగులుతుందని ఎంపీ ఆలోచన. సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు ఎలాంటి మార్పు జరుగుతుందా అని వైసీపీ కింది స్థాయి నేతల్లో ఆసక్తి నెలకొంది.
పల్నాడు జిల్లా.. సత్తెనపల్లి గొల్లమూడివారి వీధిలో వివాహిత డాబా మీద నుండి దూకి ఆత్మహత్యకి పాల్పడింది. మృతురాలు సంతోషి లక్ష్మి (40) నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు కారణం కుటుంబ కలహాలని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ పూనుకున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం మీ మాటే – నా బాట, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం లో భాగంగా నేడు బాపట్ల మండలం మురుకుండపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి వెళ్లి తెలుగుదేశం పార్టీ విధి విధానాలు వివరిస్తూ మహిళలకు చీర, నిత్యావసర వస్తువులు తెచ్చుకునే సంచి, తన గురించి తెలియజేసే కరపత్రాన్ని అందజేసి ఆశీర్వదించమని కోరారు. అనంతరం భవిష్యత్ కు గ్యారంటీ పత్రాలలో వారి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి భవిష్యత్తు గ్యారెంటీ సంక్షేమ పథకాలు గురుంచి బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ వివరించారు. ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ… ప్రజలలో వైసిపి ప్రభుత్వం పై తిరుగుబాటు మొదలైందని రాబోయే రోజులో వైసీపీ ప్రభుత్వ పతనము అవుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం లో మురుకుండపాడు గ్రామము నందు ఒక్క అభివృద్ధి పని జరిగినట్లు కూడా చెప్పట్లేదు. కానీ తెలుగుదేశం ప్రభుత్వములో రోడ్లు వేసి అభివృద్ధి చేశామన్నారు. గత కొన్ని రోజుల క్రితం గ్రామములో విష జ్వరాలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడ్డారు కానీ వైసిపి ప్రభుత్వం కనీసం వారిని పట్టించుకోలేదన్నారు. ప్రజల్లో మార్పు వచ్చిందని కచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ అరాచక పాలనకు తగిన గుణపాఠం చెపుతారన్నారు. మీ అందరికి తను అండగా ఉంటానని మురుకుండపాడు గ్రామాన్ని అభివృద్ధి చేసే భాద్యత తనదని హామీ ఇచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట మండలం, జాతీయ రహదారి 65 మీద గరికపాడు చెక్ పోస్ట్ వద్ద 69 లక్షల 98వేలు నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు. పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా మిర్యాలగూడ వైపు నుండి బస్ లో విజయవాడ వైపుకు వెళ్తున్న గుడ్లవల్లేరుకు చెందిన ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద నుండి భారీ మొత్తంలో నగదు స్వాధీనం. ఎటువంటి ఆధారాలు లేని నగదుగా గుర్తించి కేసు నమోదు చేసిన చిల్లకల్లు పి.ఎస్ సబ్-ఇన్స్పెక్టర్ కృష్ణబాబు.
గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల చించివేత. పాత గుంటూరు లోని బాలాజీ నగర్, 3,8 డివిజన్ ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు చించివేసిన వైనం. జనసేన కార్యకర్తలు ఆగ్రహం. పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను ఉద్దేశపూర్వకంగానే చించినట్లు జనసేన నేతల ఆరోపణలు. దర్యాప్తు చేస్తున్న గుంటూరు పోలీసులు.
అడ్డదారుల్లో అధికార దర్పం ప్రదర్శిస్తున్న వైకాపా నియోజకవర్గ ఇంచార్జ్ ల అరాచకాలు రోజురోజుకు పెచ్చు మీరుతున్నాయని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ ఇలాంటి విపరీత పరిణామాలు చూడలేదని, అధికారులు ప్రొటోకాల్ నిబంధనలు పక్కనపెట్టి ఇంచార్జిల పాలేర్లలా మారారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కొద్దిరోజులుగా అనేక నియోజకవర్గాల్లో వైకాపా ఇంచార్జిల కేంద్రంగా చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన నిప్పులు చెరిగారు. వాళ్ళు ఏ హోదా, ఏ అధికారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారు? కీలక సమావేశాలకి ఎలా హాజరవుతున్నారు? అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభాలు, చివరకు సంక్షేమ పథకాల పంపిణీలోనూ వైకాపా ఇన్ఛార్జ్ల హవానే కనిపిస్తుండడానికి సమాధానం కోసం ఎవరిని ప్రశ్నించాలని ప్రత్తిపాటి అన్నారు. చిలకలూరిపేటలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడారు. ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసింది కాక, నేనే చంపాను అని చెప్పిన వ్యక్తికి పూల బొకేలు ఇచ్చి, వంగివంగి సెల్యూట్లు కొట్టడానికి పోలీసులకు సిగ్గుండాలన్నారు. అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి సభల్లో ముందు వరసల్లో కూర్చోబెట్టి ఏ సందేశం ఇస్తున్నారో చెప్పాలన్నారు. జిల్లాల్లో కలెక్టరేట్లు, మున్సిపల్ కార్యాలయాలు ఇలా ఎక్కడ చూసినా వైకాపా ఇంచార్జిల రాజ్యమే కనిపిస్తోందని ప్రత్తిపాటి ధ్వజమెత్తారు. వైకాపా నేతల తీరులో రాజకీయ ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తోన్నా అధికారులు మరీ ఇంతగా ఎందుకు సాగిలపడి వారికి వత్తాసు పలుకుతున్నారని నిలదీశారు. ప్రొటోకాల్ లేని వ్యక్తుల్ని అధికారిక సమావేశాలకు అనుమతించకూడదు, ఎన్నికల తరుణంలో అలాంటి వారిని మరింత దూరం పెట్టాలి, అలాంటిది నిబంధనలకు పాతరేసి వైకాపా ఇంచార్జిలే ప్రభుత్వం అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు దారుణమని ప్రత్తిపాటి అన్నారు. నిన్నటి వరకు ఊరు పేరు లేని వాళ్లంతా ఇవాళ వైకాపా ఇంచార్జిల పేరుతో నేరుగా ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తుంటే అక్కడి అధికార పార్టీ సిట్టింగ్లే నోరు వెళ్లబెట్టాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. కలెక్టర్లు కూడా వైకాపా నేతల ముందు చేతులు కట్టుకుని కూర్చునే దుస్థితిని నేను ఎక్కడా చూడలేదని ప్రత్తిపాటి అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ ఇంచార్జ్ లు అంతా శంకరగిరి మాన్యాలు పట్టుకు పోవడం ఖాయమని, తర్వాత అధికారుల పరిస్థితేంటో ఆలోచించుకోవాలని హెచ్చరించారు.
పల్నాడు జిల్లా, దాచేపల్లి ఆర్ అండ్ బి బంగ్లా సెంటర్లో మున్సిపల్ కార్మికులకు పోలీసులకు మధ్య వివాదం నెలకొంది. మున్సిపల్ కార్మికులు సమ్మెలో భాగంగా కార్మికులు రోజు సమ్మె చేస్తున్న తరుణంలో ఈరోజు మున్సిపల్ శాఖ అధికారులు వేరే వారి ద్వారా పారిశుద్ధ పనులు చేయించాలని చూడటంతో వారిని అడ్డుకున్న కార్మికులు. రంగ ప్రవేశం చేసిన దాచేపల్లి పోలీసులు. కార్మికులకు పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బలవంతంగా స్టేషన్ కు తరలించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు, ట్రాక్టర్ ముందు బైఠాయించి నిరసన తెలియజేస్తున్న కార్మికులు.
బాపట్ల మండలం లో రైతుల పరిస్థితి అగమ్మ్య గోచరంగా ఉంది. బాపట్ల మండలంలోని కంకట పాలెం మురుకొండపాడు గ్రామాలలో జూన్, జూలైలో వదలాల్సిన సాగునీరు కాలువల రిపేర్ వలన సెప్టెంబర్, అక్టోబర్లో సాగునీరు విడుదల చేశారని దానివలన రైతులు వరి నారుమళ్లు ఆలస్యముగా పోసి సాగునీరు లేటు అవ్వటం వల్ల లేటుగా వరి నాట్లు ప్రారంభించారు. ఇప్పుడు వరి పైరు ఈత దశలో ఉన్నందువల్ల వరి పైరుకు నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఈ తరుణంలో రైతులు పంట పొలాల వద్దకు వచ్చి బిక్క మొఖం వేస్తున్నారు. గత నెల రోజులుగా వరి పైరుకు నీరు లేక అల్లాడిపోతున్నామని రైతులు వాపోతున్నారు. మిగ్జాం తుఫాన్ నేపథ్యంలో కురిసిన భారీ వర్షాలకు రైతులకు కొంత ఊరటనిచ్చిన ఆ పిదప కాలువలకు గండ్లు పడి అప్పటినుండి ప్రభుత్వం వరి పైరకు నీరు ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. ముందు చూపులేని ఈ గుడ్డి ప్రభుత్వం మిచాంగ్ తుఫాన్లో బాపట్ల, గుంటూరు, కృష్ణాజిల్లాలో భారీ వర్షాలు కురిసిన ఇరిగేషన్ అధికారులు ప్రకాశం బ్యారేజ్ వద్దన్న గేట్లు మొత్తం ఎత్తి నీరును సముద్రంలోకి వృధాగా వదిలి వేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే ముందు చూపుతో ఇరిగేషన్ అధికారులు బ్యారేజ్ వద్ద కొంత నీరును నిలిపి రైతులకు నీరు ఇచ్చి ఉంటే ఈరోజు మేము ఈ విధంగా నష్టపోయే వాళ్ళం కాదని రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు సాగు నీరు విడుదల చేస్తే కొద్దిపాటి పెట్టుబడులతోనైనా బయటపడతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూస్తామని రైతులు అంటున్నారు. ఈ ప్రభుత్వానికి రైతుల గోడు పట్టదా అని ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే నీళ్ల పరిస్థితి ఇలా ఉంటే మురుకుంటపాడు పొలాలకు వెళ్లే దారి పరిస్థితి చాలా దయానీయంగా ఉందని రైతులు అంటున్నారు. మేము సంవత్సర కాలం పాటు ఇదే రోడ్డులో ప్రయాణం చేయాలని వర్షం కురిస్తే ఈ రోడ్డు చిత్తడి చిత్తడిగా మారి చాలా ఇబ్బందిగా ఉంటుందని రైతులు వాపోతున్నారు. ఈ మురుకొండపాడు రోడ్డులో 5 వేల ఎకరాలకు రైతులు, రైతు కూలీలు ప్రయాణిస్తుంటారని పొలంకు వెళ్లి వస్తే మా నడుములు గుల్లవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రోడ్డు ప్రారంభోత్సవం చేసినప్పటికీ 2019 ఎలక్షన్లు వచ్చి ఈ రోడ్డు పనులు ఆగిపోయినాయి. అప్పటినుండి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక తట్ట మట్టి కూడా వేసిన దాఖలలు లేవని రైతులు వాపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ రోడ్డుకు మరమ్మతులు చేసి రోడ్డుపై ప్రయాణించడానికి వీలుగా రైతులకు, రైతు కూలీలకు ఇబ్బంది లేకుండా చేయాలని ప్రభుత్వ అధికారులను రైతులు వేడుకుంటున్నారు.
Read Also..