అంబేద్కర్ పేరు తీసి జగన్ పేరు పెట్టాలి అనడం, అంబేద్కర్ ను అవమానించడమే అని వైసీపీ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు జనసేన తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్. వైసీపీ రాజ్యాంగ సృష్టికర్తను గౌరవించక పోయిన పరవా లేదు అవమానించకండి అన్నారు. జగన్ పార్టీలో నేతలందరూ ఇంతేనా ఎలక్షన్ ముందు దళితులను ముద్దులు పెట్టుకుని ఇప్పుడిలా మాట్లాడడం బాధాకరం. అంబేద్కర్ గారి పెద్ద విగ్రహం పెట్టడం కాదు జూపూడి ప్రభాకర్ మాటలను జగన్, వైసీపీలోని నేతలు ఎందుకు ఖండించరు అంటూ జనసేన దళితనాయకులు తిరుపతి ఇంచార్జ్ తీవ్రంగా ఖండించారు.
జిందాల్ ప్లాంట్ ఏర్పాటు వ్యయం, నిర్వహణ తీరుపై ప్లాంట్ ప్రతినిధులను, అధికారులను రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, యూనిట్ విక్రయ ఛార్జీల వివరాలను ఆయనకు ప్రతినిధులు వివరించారు. కాకినాడ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర-2026 నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు సంబంధించి మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా యోగాంధ్ర 2026పై తలపెట్టిన కార్యక్రమాలపై అధికారులు ప్రజెంటేషన్…
అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, ఏడీసీ అధికారులు,…