Sunday, July 26, 2026
News Navigation
Sunday, July 26, 2026
News Navigation

Breaking

Sunday, July 26, 2026
Home Andhra Pradesh వివాహితను చిత్రహింసలకు గురి చేస్తున్న సైకో భర్త..

వివాహితను చిత్రహింసలకు గురి చేస్తున్న సైకో భర్త..

by Rama
marital women

కుప్పం మండల పరిధిలోని వసనాడుకు చెందిన శివ శంకర్ కు ముల్లూరు కృష్ణాపురంకు చెందిన హిమబిందుకు 13-10- 2016 న వివాహమయ్యింది. కాగా పెళ్ళైన 6 నెలల నుండి హిమబిందు ను తన భర్త శివ శంకర్ వేధింపులకు గురి చేస్తున్నాడని హిమంబిందు వాపోయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనకు పిల్లలు పుట్టలేదనే నెపంతో తన భర్త శివ శంకర్ కుటుంబీకులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. శివశంకర్ కుటుంబీకులు తనపై దాడి చేసి వేధింపులకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యంతమైంది. తనకు తెలియకుండా గత ఆరు నెలలకు ముందు బీహార్ కు చెందిన మైనర్ బాలికను శివశంకర్ పెళ్లి చేసుకున్నారని, గత వారం ముందు మైనర్ బాలికను ఇంటికి తీసుకొచ్చారని పేర్కొంది. రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావు అని నిలదీయడంతో, తనను కొట్టి తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించింది. ముల్లురు కృష్ణాపురం గ్రామంలో అర్ధరాత్రి సమయంలో కారులో తీసుకొచ్చి పడేశారని హిమబిందు వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి శివశంకర్ పై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని హిమబిందు కోరారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: తిరుపతిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.


నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ …
మంగళగిరిలో కాపర్ వైర్ చోరీ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ వైర్లను చోరీ చేస్తున్న …
ఏలూరు జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్‌కు విస్తృత ఏర్పాట్లు.
ఏలూరు జిల్లాలో ఈ నెల 24న నిర్వహించనున్న మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్‌కు జిల్లా యంత్రాంగం అన్ని …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: