Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Devotional పాలరాయితో నిర్మించిన నందీశ్వరుడు విగ్రహం.. ఎక్కడుందో తెలుసా..!

పాలరాయితో నిర్మించిన నందీశ్వరుడు విగ్రహం.. ఎక్కడుందో తెలుసా..!

by Satya
Nandiswara statue made of marble

ఈ ఆలయంలో రకరకాల శిల్పాలు…

ఈ ఆలయంలో రకరకాల శిల్పాలు(Sculptures) దర్శనమిస్తాయి. ఒక్కసారి ఈ శిల్పాలను చూసినట్లయితే అవి నిజమైనవా? లేదంటే ఒక ఆకారాన్ని తయారు చేసి అక్కడ కూర్చో బెట్టారా? అని తెలుసుకోవడం కష్టమే. ఈ గుడి ఆవరణంలో చాలా శిల్పాలు ఉన్నాయి. వాటన్నింటిని చూడడానికి భక్తులు చాలా ఇష్టపడుతూ ఉంటారు. శ్రీ విష్ణునంది గుడికి ఎదురుగా పాలరాయితో నంది విగ్రహాం చూపురులను ఆకట్టుకుంటుంది. ఎక్కడ కూడా ఒక చిన్న తేడా లేకుండా పాలరాయితో నంది విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ విగ్రహానికి సపరేటుగా ఒక గుడిని నిర్మించారు. ఆ పాలరాయితో చేసిన నందిని మనం చూసినట్లయితే సాక్షాత్తు ఆ పరమశివుడే కైలాసం నుంచి దిగి వచ్చి ఈ నంది విగ్రహాన్ని తయారు చేశాడా అన్నట్లుగా ఉంటుంది. ఆ నంది విగ్రహానికి ప్రాణం ఉంటే ఏ విధంగా ఉంటుందో అంతేచూడముచ్చటగా, అందరినీ కనువిందు చేస్తోంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఒక్కసారిగా ఆ విగ్రహం వైపు చూసినట్లయితే నిజమైన నంది అన్నట్లుగా ఉంటుంది. ఈ పాలరాతి నంది నిజమైన ఆవు అని భావించి పులి దాడి చేసిందనే కథను ఇక్కడి ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ గుడిలో నందీశ్వరుని పాలరాయితో చేయడం విశిష్టత. దాదాపుగా ఉమ్మడి జిల్లాలో ఏ శివాలయంలోను పాలరాయితో చెక్కిన నంది విగ్రహం ఎక్కడ మనకు దర్శనం ఇవ్వదు. ఓంకార క్షేత్రం నుంచి మహానందికి వెళ్తున్న రోడ్డు మార్గంలోశ్రీ విష్ణునంది గుడి ఎదురుగా ఈ పాలరాయితో చెక్కబడిన నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి శివరాత్రి సమయాలలో వేలాది మంది భక్తాదులకు పాలరాయితో చెక్కిన నందిదర్శనం ఇస్తుంది. నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రం వెళ్లే రోడ్డు మార్గంలో శ్రీ విష్ణు నంది దేవాలయం, ఎంతో ప్రాముఖ్యత చెందిన గుడిగా చెప్పవచ్చు.

ఇది చదవండి: Arasavelli: స్వామివారి పాదాలను తాకని సూర్య కిరణాలు


కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్.
పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా నర్సరావుపేట సమీపంలోని ప్రముఖ కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని …
శబరిమలలో తెలుగు భక్తుల తీవ్ర ఇబ్బందులు.
శబరిమల యాత్రలో తెలుగు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర గురుస్వాములు ఆవేదన వ్యక్తం చేశారు. …
విశాఖ జిల్లా కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలు.
విశాఖ కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 28 నుంచి …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: