42
తమిళనాడులోని తిరువణ్ణామలైలో పవిత్ర శ్రీ రమణాశ్రమాన్ని కేంద్రమంత్రి అమిత్ షా సందర్శించారు. శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి.. మహర్షి బోధనలు, జీవితాన్ని స్మరించుకున్నారు. శ్రీ రమణ మహర్షి జీవితం, బోధనలు మానవాళి మార్గాన్ని శాశ్వతంగా ప్రకాశింపజేసే జ్ఞానపు జలధారగా నిలుస్తాయని అమిత్ షా పేర్కొన్నారు. ఆ మహనీయుని ఆశీస్సులు అందరికీ శ్రేయస్సు, సౌభాగ్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. తిరువణ్ణామలైలోని శ్రీ రమణాశ్రమం సందర్శన సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో కొంత సమయం గడిపారు.