Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home National ఛ‌త్తీస్‌గ‌ఢ్ లో మ‌రోసారి కాల్పులు కలకలం..

ఛ‌త్తీస్‌గ‌ఢ్ లో మ‌రోసారి కాల్పులు కలకలం..

by Satya
Another firing in Chhattisgarh

ఛ‌త్తీస్‌గ‌ఢ్(Chhattisgarh):

ఛ‌త్తీస్‌గ‌ఢ్ దండ‌కార‌ణ్యంలో మ‌రోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. శ‌నివారం భ‌ద్ర‌తా ద‌ళాలు, మావోయిస్టుల మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. అలాగే ఇద్ద‌రు జ‌వాన్లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారని తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న బీజాపూర్ జిల్లా(Bijapur District)లోని పీడియా అట‌వీ ప్రాంతంలో జ‌రిగింది. ఘ‌ట‌నాస్థ‌లి నుంచి భ‌ద్ర‌తా ద‌ళాలు భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. కాగా, ఎన్‌కౌంట‌ర్‌లో చ‌నిపోయిన ముగ్గురు న‌క్స‌లైట్ల వివ‌రాల‌ను అధికారులు వెల్ల‌డించలేదు. నాలుగు రోజుల క్రితం కూడా ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని చోటేతుంగాలి అట‌వీ ప్రాంతంలో కూడా ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఈ ఎన్‌కౌంట‌ర్‌(Encounter)లో న‌లుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో దిగ్విజ‌య్ సింగ్..


నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.
గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం …
తమిళనాడు సీఎం విజయ్ పాలనపై స్టాలిన్ ఫైర్.
తమిళనాడు రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య విమర్శలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై …
ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.
భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: