తెలంగాణ రాజకీయాల్లో(Telangana politics) తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాధాకిషన్ రావు(Radhakishen Rao), ప్రణీత్ రావు(Praneet Rao), భుజంగ రావు(Bhujangarao), తిరుపతన్నలపై సైబర్ టెర్రరిజం సెక్షన్ లు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. దేశ భద్రతకు సాఫ్ట్ వేర్ ద్వారా ముప్పు వాటిల్లేలా చేస్తే వారిపై ఐటీ యాక్ట్ 66 (ఎఫ్)కింద నమోదు చేసే సైబర్ టెర్రరిజం కేసులు ప్రయోగిస్తారు.
ఇది చదవండి: ఇంటర్ ఫలితాలలో “అల్ఫోర్స్” చారిత్రాత్మక విజయం…
ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని అక్రమంగా చొరబడి తస్కరించిన ఈ నలుగురు నిందితులపై ఐటీ యాక్ట్ 66 (ఎఫ్) కేసులు జోడించేందుకు అనుమతి కోరుతూ పంజాగుట్ట పోలీసులు తాజాగా నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ సెక్షన్ కింద కేసు నిరూపణ జరిగితే జీవిత ఖైదీగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాగా ఇప్పటికే వీరిపై ఐటీ యాక్ట్ 70 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 70లో 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- హైడ్రా, రంగనాథ్పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు.హైడ్రాతో పాటు కమిషనర్ రంగనాథ్పై తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. లోతుకుంట ప్రాంతంలోని భూవివాదానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంలో హైకోర్టు ఈ కీలక హెచ్చరికలు జారీ చేసింది. లోతుకుంట పరిధిలోని…
- నీట్ పేపర్ లీకేజీపై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పీడీఎస్యూ డిమాండ్.నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పీడీఎస్యూ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి