52
సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించి ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు అందేలా చేయడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కుప్పంలో నిర్వహించిన కార్యక్రమంలో పీ-4 కార్యక్రమం లక్ష్యాలను వివరించారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక సాధికారతకు కొత్త దిశగా నిలుస్తుందని పీ-4 తెలిపారు. సమాజంలో ఆర్థికంగా బలమైన, బంగారు కుటుంబాలు వెనుకబడిన కుటుంబాలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. పేదరిక నిర్మూలన, విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక స్వావలంబన వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. ప్రభుత్వం, ప్రజలు, పారిశ్రామికవేత్తలు, దాతలు కలిసి పనిచేస్తే ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి బాటలో నడిపించవచ్చని, అదే పీ-4 కార్యక్రమం అసలు లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.





Total views : 196553