54
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు ప్రత్యేక గుర్తింపు దక్కుతోంది. లేపాక్షి ఎంపోరియంను ప్రారంభించిన ఏపీ జౌళి శాఖ మంత్రి సవిత.. రాష్ట్రంలోని చేనేత, హస్తకళాకారుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో హస్తకళలు, చేనేత రంగాలకు ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. తక్కువ సమయంలో కోటి 50 లక్షల రూపాయలతో లేపాక్షి ఎంపోరియంను పునరాభివృద్ధి చేసిన సిబ్బందిని మంత్రి అభినందించారు. హస్తకళాకారులకు మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని, “తరంగ” అప్లికేషన్ ద్వారా మార్కెట్ ట్రెండ్స్, శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.ఏపీలోని ప్రత్యేక కళలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు.





Total views : 219357