అక్రమంగా తరలిస్తున్న, దాచిన 18.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని చింతలపాలెం మండలంలో పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన జగన్నాథం శ్రీనివాసరావు చింతలపాలెం మండలం దొండపాడులో మూడు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ప్యాసింజర్ ఆటోలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కునికిపాడుకి చెందిన బండారుపల్లి రామాంజనేయులుకు పంపుతుండగా.. చింతలపాలెం మండలం దొండపాడులోని బొమ్మల సెంటర్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కునికిపాడులోని రామాంజనేయులుకు చెందిన కోళ్ల ఫాంని సోదా చేయగా సుమారు 12.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం లభించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- రాబర్ట్ వాద్రాకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట..ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు భారీ ఊరట లభించింది. హర్యానాలోని గురుగ్రామ్ భూ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆయనకు ఉపశమనం కలిగింది. ఇవాళ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన ఆయనకు ప్రత్యేక…
- నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బోరు గుంతలో పడిపోయిన నాలుగేళ్ల చిన్నారిని కాపాడేందుకు వెళ్లిన తాత ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద ఆడుకుంటున్న…
- మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..మహారాష్ట్రలోని పుణెలో ఓ యువకుడు చేసిన నకిలీ బాంబు కలకలం వెయ్యిమంది పోలీసులను పరుగులు పెట్టించింది. సోలాపూర్కు చెందిన శివాజీ రాథోడ్ అనే యువకుడు తన వైద్యానికి 7 లక్షల రూపాయలు సమీకరించాలనే ఉద్దేశంతో ఈ డ్రామాకు తెరలేపాడు. హడప్సర్లోని కామధేను…
- బంగారం దిగుమతులను తగ్గించేందుకు కొత్త వ్యూహం..దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పే ఒక అతిపెద్ద సంచలనానికి మోదీ సర్కార్ సిద్ధమవుతోందా? మీ ఇంట్లో.. అల్మారాల్లో.. లాకర్లలో పేరుకుపోతున్న బంగారం, ఇప్పుడు దేశానికి ఆర్థిక ఆయుధంగా మారబోతోందా..? అసలు ఏంటి ఈ గోల్డ్ మానిటైజేషన్ మాస్టర్ ప్లాన్? సామాన్యుడికి…
- చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్హౌస్కు చేరుకున్నారు. యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ట్రంప్ రెండ్రోజుల చైనా పర్యటన ముగిసింది. ఒప్పంద ప్రకటనలేవీ లేకుండానే ఈ పర్యటన ముగిసింది. ఐతే కీలకాంశాల్లో ఏకాభిప్రాయాలు కుదిరాయని, ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కీలక పురోగతి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 78480