శ్రీశైలం టోల్గేట్ చెకింగ్ పాయింట్ వద్ద అర్ధరాత్రి చిరుతపులి సంచారం కలకలం రేపింది.అటవీప్రాంతంలో నుండి చిరుతపులి బయటకు వచ్చి టోల్గేట్ చెకింగ్ పాయింట్ వద్ద చిరుత పులి కుక్కను చంపి అటవీలోకి తీసుకెళ్లింది. దర్శనార్థం భక్తులు వెళ్లే మార్గంలోని రోడ్డుపై చిరుత పులి కుక్కని చంపి తీసుకెళ్లడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో అటుగా వెళుతున్న కొందరు భక్తులు తమ వాహనాలలో కూర్చొని కారు లైట్లు చిరుతపులి ఉన్న వైపు వేసి తమ సెల్ ఫోన్లలో వీడియో చిత్రీకరించారు. వీడియో తీస్తున్న క్రమంలో భక్తుల అరుపులు శబ్దం మిన్న చిరుత పులి గోడ పైనుండి కిందకు దూకి పక్కనే ఉన్న అటవీప్రాంతంలోకి వెళ్లిపోయింది. రాత్రి సమయం కావడంతో భక్తులు ఎవరు అటువైపు వెళ్లకపోవడం పైగా చీకటిగా ఉండటంతో చిరుతపులి బయటకు వచ్చినట్లు భావిస్తున్నారు. చిరుత పులి సంచారం గురించి శ్రీశైలం అటవీశాఖ రేంజర్ నరసింహులుకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించి హుటాహుటిన అటవీశాఖ సిబ్బందిని అలర్ట్ చేశారు..
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి. ఈ…
- చిలకా ప్రొడక్షన్స్ థ్రిల్లర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్గా మూవీ గ్రాండ్ రిలీజ్..నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా…
- తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…
- విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
- తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్..తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్ సృష్టించిన సీఎం విజయ్..తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన క్రమశిక్షణ, సమయపాలన అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయంలో విధులకు హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 79188