Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh చెరువు రక్షణ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం – బడి సుధాయాదవ్

చెరువు రక్షణ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం – బడి సుధాయాదవ్

by Prakash
Badi Sudha Yadav

చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలం బడి సుధాయాదవ్ పోరాటం Badi Sudha Yadav Protest

పుదిపట్లలో రాష్ట్ర ఒబిసి ఫోరం కన్వీనర్ బడి సుధాయాదవ్(Badi Sudha Yadav) తుమ్మలగుంట చెరువును సంరక్షించాలని ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధీనంలో ఉన్న తుమ్మలగుంట చెరువును రక్షించాలని తన అనుచరులతో కలిసి పుదిపట్ల లోని చెర్లోపల్లి సర్కిల్ లో ఆమరణ నిరహార దీక్షకు దిగారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 100 కోట్లు తుడా నిధులు వెచ్చించి ఆధునీకరణ పేరుతో చెరువును సర్వ నాశనం చేశారని ఆరోపించారు. కాంట్రాక్టు పనులు కూడా తన కుమారుడుకి అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

చెరువును రక్షించండి.. నీటిని మళ్లించండి…

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా చెరువు అన్యాక్రాంతం పై చర్యలు తీసుకోవాలని కోరినా రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు నిద్రపోతున్నారని మండిపడ్డారు. చెరువును రక్షించండి.. నీటిని మళ్లించండి అంటూ నినాదాలు చేశారు. చెరువును సర్వే చేసి బఫర్ జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీక్షను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా శాంతియుతంగా దీక్ష చేస్తున్నామని బడి సుధాయాదవ్ తెలిపారు. తుమ్మలగుంట చెరువు రక్షణ కోసం ప్రాణ త్యాగానికి సిద్దమంటున్నారు బడి సుధాయాదవ్.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే …
పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం …
22ఏపై బీజేపీ దీక్షలు.
భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: