Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh జగన్‌పై విరుచుకుపడ్డ చంద్రబాబు

జగన్‌పై విరుచుకుపడ్డ చంద్రబాబు

by Satya
Chandrababu lashed out at Jagan

సీఎం జగన్‌పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ తనని తాను అర్జునుడు అని పోల్చుకుంటున్నారన్నారు. నిజానికి జగన్ అర్జునుడో, అభిమన్యుడో కాదు భస్మాసురుడు అని చంద్రబాబు విమర్శించారు. నెల్లూరు ఎస్వీజీఎస్ గ్రౌండ్స్‌లో జరిగిన రా కదలిరా సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్ట పోయిందన్నారు. బెదిరించి, భయపెట్టి తరిమేసే పరిస్థితికి వచ్చారన్నారు. తుగ్లక్ ఆలోచనలు. సైకో పాలనతో ఏపీలో జగన్ విధ్వంసం సృష్టించారన్నారు. రాష్ట్రంలో ఏ వర్గమైనా ఆనందంగా ఉన్నారా అంటూ ప్రశ్నించారు. రైతు చితుకుపోయాడంటూ ఆరోపించారు. అప్పులు ఎక్కువ ఉండే రైతాంగం, ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య అధికంగా ఉండే రాష్ట్రంగా ఏపీ తయారైందన్నారు. ఇప్పుడు కూడా అబద్దాలే చెబుతున్నాడంటూ విమర్శలు చేశారు. అబద్దాల్లో సీఎం జగన్‌కి డాక్టరేట్ ఇవ్వాలంటూ వ్యాఖ్యానించారు.

Advertisements

You may also like

Our Visitor

013986
Total views : 78784

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.