289
తిరుపతి నగర శివారు ప్రాంతాల్లో చెడ్డి గ్యాంగ్ దొంగలు సంచారం కలకలం రేపింది. దీంతో పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తీల్చారు. రాత్రి సమయంలో ఇంటి తలుపులు తట్టడం, కాలింగ్ బెల్ కొట్టిడం.. వేరే రకమైన శబ్దాలు చేస్తూ ప్రమాదం ఉందని అనిపించినా.. ఎవరు నిర్ధారించుకోకుండా తలుపులు తీయవద్దని పోలీసులు హెచ్చరించారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. వెంటనే డైల్ 100 లేదా… దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలని కోరారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి.. పోలీసు యంత్రాంగం తీవ్రమైన కృషి చేస్తుంది.




Total views : 62270