రాష్ట్ర ప్రజలు వన్స్ మోర్ జగనన్న అంటున్నారని చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (Chevireddy Mohith Reddy) ఆనందం వ్యక్తం చేశారు. తిరుపతి రూరల్ మండలం తిరుమల నగర్ పంచాయితీ పరిధిలో మన ఊరికి మన మోహిత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువకులు భారీగా పాల్గొన్నారు. తిరుమల నగర్ పంచాయితికి ఐదేళ్ల లో 7కోట్ల తో అభివృద్ధి చేశాం అని స్పష్టం చేశారు. అర్హులైన పేదలకు వారి ఖాతాల్లో రెండు నుంచి నాలుగు లక్షలు రూపాయలు సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అందించామని తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో గతంలో కన్నా చంద్రగిరి నియోజకవర్గం (Chandragiri Constituency)లో భారీ ఆధిక్యం తో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 24న నామినేషన్ వేయనున్నట్లు తెలిపిన మోహిత్ రెడ్డి, ప్రతి సర్వేలు వైసీపీ కి అనుకూలంగా చెబుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీగా పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల అంశంపై కీలక నిర్ణయం..శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల జలాల అంశంపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కేఆర్ఎంబీ హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నీటి నిల్వలు, విడుదలపై అధికారులు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాగార్జున సాగర్ నుండి…
- అమరావతిలో వేగంగా కొనసాగుతున్న నిర్మాణ పనులు.అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంతంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ను పరిశీలించిన అనంతరం మంత్రి కీలక వివరాలు వెల్లడించారు. ఎమ్మెల్యే టవర్లు దాదాపు పూర్తయ్యాయని, వారం రోజుల్లో వాటిని జీఏడీకి అప్పగిస్తామని…
- కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట హవల్దార్ నిరసన.కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నేవీలో పనిచేస్తున్న హవల్దార్ నిరసనకు దిగారు. తనకు ప్రభుత్వం కేటాయించిన మూడు ఎకరాల పొలం విషయంలో ఇద్దరు వ్యక్తులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు. కర్నూలు నగరానికి చెందిన ఏ. విజయ్…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 74859